పుట:AndhraRachaitaluVol1.djvu/397

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆకొండి రామమూర్తి శాస్త్రి

1875

ఆరామ ద్రావిడశాఖీయ బ్రాహ్మణులు. ఆత్రేయసగోత్రులు. జన్మస్థానము: కేశనకుర్రు
పోలవరము. తల్లి: లచ్చమ్మ. తండ్రి: రామస్వామి. జననము: భావ సంవత్సర కార్తిక శుద్ధ ప్రథమ.
1875 సం|| రచనలు: 1. స్వప్నానసూయ (కావ్యము) 2. దేవీభాగవత నవమ స్కంధము
(తిరుపతివేంకటకవుల దేవీభాగవతమున తొమ్మిదవ స్కంథము మాత్ర మీ కవి తెనిగించెను)
3. జీవానందన నాటకము (ఆముద్రితము.)

రామమూర్తి శాస్త్రిగారు ప్రత్యేకముగ రచించి ప్రకటించిన కావ్యము "స్వప్నానసూయ" ఈ యొక కావ్యమునిబట్టియే కాదేవీభాగవత నవమస్కంధ రచనవలన గూడ నీయనకు రచయితలలో స్థానమేర్పడినది. నవమస్కంధము తెనిగించుటలో శాస్త్రిగారొకరేకాదు. , వీరికి మఱియొకకవి సాయపడినాడు. ఆయనపేరు నిశ్శంకులకృష్ణమూర్తి. వీరిరువురును కలసి రామకృష్ణకవులు.


తిరుపతి వేంకటకవులను విననివారుండరు. వేంకటరామకృష్ణ కవులను విద్వత్కవు లందఱు నెఱుగుదురు. ఇపు డీ "రామకృష్ణుల జంట నెఱిగినవారు చాల గొలదిమంది. దానికిగారణము వీరు పెక్కు కృతులు రచింపనులేదు; పత్త్రికలలో వీరిపేరు మనము పరికించుచుండుటయు లేదు. చిత్తములు కవిత్వమందున్నను వృత్తులు వేఱగు--గవిలోకములో వీరికెక్కుడు పేరు బెంపులు లేకపోయినవి.ఆకొండి రామమూర్తి శాస్త్రిగారు అనాదిప్రసిద్ధాయుర్వేద వైద్యములో నందెవేసినచేయి. నిశ్శంకుల కృష్ణమూర్తిగారు కాలు కదప నక్కఱ లేకుండ మంచి సగటుగా గ్రామ కరణపుబని చేసికొనుచుండు నేర్పరి ఇరువురు ---------------------కాలవరమే కాపురముగా గలవారు.ఇరువురు

(ఈఖాళీలలోని అక్ష్రములు కనబడుటలేదు)