పుట:AndhraRachaitaluVol1.djvu/396

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గీ. ఆకులారవు; గంటంబు లసలెకావు;

కాగితంబులు కలము లెక్కడను లేవు;

ఒక్కయక్కర మైన వ్రాయుపనిలేక

యెల్లశ్రుతులును వల్లించి రెల్ల ఋషులు.


గీ. తనువులకు జీవకళపోల్కి దరణి చంద్ర

ములకు బ్రభవోలె నా వేదపుంజమునకు

నస్ఖలితమై వెలుంగు మహాస్వరంబె

ముఖ్యముగ నెన్నబడె ఋషిముఖులచేత.


ఈ రకమగు కవితాధారతో శ్రీభుజంగరావుగారు శతాధికములు కృతులు సంతరించి రనగానదిపురాజానుషమైన పుణ్యఫలము. "కవియు రాజును, మంత్రిప్రగడ భుజంగ, రావుబహదూరు, హేలాపుర ప్రధాని, నయశతాధిక గ్రంథకర్త, యవధాని దర్శనాచార్యబిరుదమ్ము దనరబూనె" అని యాయన వ్రాసికొన్నట్లుగా సకలభాగ్యములు వీరికి బట్టినవి. శ్రీ కొత్తపల్లి సుందరరావు అను కవివరునొకని తనసంస్థానములో బెట్టుకొని గౌరవించిన యీ కవిప్రభువు శీలసంపత్తి గణనీయము.

                          ________________