పుట:AndhraRachaitaluVol1.djvu/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మతుకుమల్లి నృసింహకవి

1816 - 1873

ఆరువేలనియోగి. కృష్ణయజుశ్శాఖీయుడు. ఆపస్తంబ సూత్రుడు. కాశ్యపగోత్రుడు. జన్మస్థానము: తెనాలి. తల్లి: జానకమ్మ. తండ్రి కనకాద్రిశాస్త్రి. జననము: 1816 - ధాతృ సంవత్సర శ్రావణ బహుళ చతుర్దశి. నిర్యాణము: 1873 - శ్రీముఖ సంవత్సర శ్రావణ బహుళ తృతీయ. గ్రంథములు: 1. ఆంధ్రమేఘసందేశము. 2. వేంకటాచలయాత్రా చరిత్రము. 3. ఆజచరిత్రము. (ఆంధ్ర ప్రబంధము 1912 ముద్త్రి) 4. చెన్నపురీ విలాసము (ప్రౌఢప్రబంధము. 1920 ముద్రి) 5. శ్రీకృష్ణ జలక్రీడా విలాస నాటకము. 6. నృసింహసహస్ర నామావళి (సం.) 7. పుండ్రకళానిధి (సం.) 8. ఆంధ్ర సిద్ధాంత కౌముది. 9. భరతశాస్త్ర సర్వస్వము. 10. సంగీతసార సంగ్రహము (ఆముద్రి.)

మూడుశతాబ్దులనుండి వీరిది పండితవంశము. ఈ నృసింహ విద్వత్కవి ప్రపితామహుడు మాధవకవి. ఈయన వ్యాసభారతము యధామాతృకముగ ననువదించి "అభినవభారతము" అని పేరుపెట్టెను. ఈ మిశ్రకావ్యమున బ్రస్తుత మాదిపంచకము మాత్రము మిగిలియున్నది. తక్కుగల పర్వములు తాడిపత్రి గ్రామమున దగులబడినట్లు చెప్పుదురు. తెనాలి గోవర్ధనస్వామి కోవెల యెదుటగల గరుడవిగ్రహము మాధవకవి శిల్పకళాకుళలతకు దార్కాణ. ఈయన పుత్రులు నృసింహశాస్త్రి గారు. వీరు వేదవిదులు. గొప్ప వైయాకరణులు. కనకాద్రిశాస్త్రిగారు వీరికు గుమారులు. వీరే మన ప్రస్తుత కవివరుని జనకులు. కనకాద్రిశాస్త్రిగారు సకలశాస్త్ర ప్రవీణులు. శ్రీ మల్రాజు గుండారాయుడుగారి సంస్థాన పండితులు. గుండా రాయడుగారు నాడు పేరుమోసిన పెద్ద జమీందారులలో నొకరు. శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు వీరిని గూర్చి యీకథ ముచ్చటించిరి:

"ఒకప్పుడు వాసిరెడ్డి వేంకటాద్రినాయడునును, నర్సారావుపేట మల్రాజు గుండారాయడును, నూజవీటి అప్పారావును, చల్లపల్లి అంకి