పుట:AndhraRachaitaluVol1.djvu/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామచంద్రశాస్త్రిగారు వేణీసంహార ముద్రారాక్షస శాకుంతలము లనువదించిరి. సంస్కృతాంధ్ర కవితలు రెంటను వీరిచేయి యారితేఱినది. మేఘసందేశము తరువాతి కథను ఘనవృత్తము అను గీర్వాణకావ్యముగ రచించిరి. దీనికి దెలుగుసేత శ్రీ మల్లాది అచ్యుతరామశాస్త్రి గారు చేసిరి. యక్షసందేశ శ్రవణానంతరము మేఘుని వృత్తాంతము తెలుపున దగుట దీనిని ఘనవృత్తమని పేరుకొనిరి. అందలి ధోరణికి కాళిదాసు నొరవడి.

శ్లో. ఇత్యుక్తోసౌ సపది జలద స్తేన దీనాత్మనాలం
శ్రుత్వా కామం సరసహృదయ ప్రాగ్రణీత్వాత్ప్రహృష్టః
లోకే దీనావన మనుపమం పుణ్య మా దత్తఏవ
సంతః ప్రోచు స్తదిహ హిమయాతో షణీయస్సఖా మే