Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/379

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సీ. ప్రత్యూష పవనముల్ పారాడ జిలువ లూ

రిన వాలుకా వితర్ది కలయందు

ఫలితో పవనవాటికల శీతలచ్ఛాయ

లలమిన హరిత శాద్వలములందు

బరువంపు వెన్నెలల్ వాఱి చుక్కలుదేలు

పఱపైన మేడ యుప్పరిగలందు

బొగజోపి చిఱువత్తు ల్వ్గ ద్రోసి చమురు దీ

పాలిడ్డ వీధి సోఫాలయందు


శిష్యగణముతో శివరాజు జేర్చికొనుచు

భారతాదుల భావసంపదల దెలిపి

ఘనుడు దాదోజి తనవిమర్శనము లిచ్చి

నవ్య సాహిత్య యోధసంతతులు నడిపె.


సీ. ఆవులించిన మాత్ర బ్రవు లెంచగ నేర్చి

నీటిలో జాడలు నెమక నేర్చి

పాలు నీరును వేఱుపఱుచు నాణెము నేర్చి

కనుపాపనీడల గాంచ నేర్చి

బాలెంత బెబ్బులి పాలు పిండగ నేర్చి

దళము లంటక తేనె ద్రావనేర్చి

యెండసోకుల దప్పి వెడలింపగా నేర్చి

శిలలకు గిలిగింత గొలువనేర్చి


పొత్తమునగాక ప్రకృతిలో బుటలు విప్పి

పదములనుగాక భావముల్ పట్టి తరచి,

యన్వయ వ్యతిరేక దృష్టాంత గతుల

నరసి, భాపుక పండితుం డయ్యె శివుడు.