పుట:AndhraRachaitaluVol1.djvu/378

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తల్లిఱెక్కల ప్రోవు దలగని సాంభాజి

భావి జీవితనౌక భంగపఱచి

కమియమాగినపండు గర్భపిండ మగల్చి

కఱకు గాకలదాలి గ్రాగ జేసి

ఇంత ప్రళయంబు గలిగింప నేలనయ్య

కనికరము లేదొ, పాపసంకటము రాదొ,

కన్న తండ్రివికాదొ, యక్కసముపోదొ,

వలదు వలదయ్య పచ్చని యిలు రగుల్ప. [ప్రథమశ్వాసము]


జీజియాబాయి చంటిబిడ్డ శివాజి కుగ్గుబాలతో, జోలపాటతో, వీరచరితములు నూఱిపోసినది. దాదోజీ గురుత్వమున శివాజి చక్కగ జదువను వ్రాయను నేర్చి, అంకగణితము నెఱిగి రాజ్యాంగవిధానముల మెలకువలు తెలిసికొనెను. మాతౄపదేశము కరడుగట్టిన శివాజికి మతముమీద - దేశముమీద నున్నంత యభిమానము, పట్టుదల శాస్త్రములమీద నుండకపోవుట వింతగాదు-


మ. కలతం జెందెడు నాత్మదేశమతముల్ గాపాడ, శస్త్రాస్త్ర వి

ద్యలు జాణక్య తవంబులున్ జదువు విద్వాంసుల్, మహారాష్ట్ర వీ

రులు వేదాంగము లెత్తి యర్థముల మార్పుం దీర్పు చర్చించు తా

తల తాటాకుల మీది గంటముల వ్రాతల్ గోతలున్ మెత్తురే!


ఈ నాలుగు పంక్తుల పద్యములోను గవివారికి దేశస్వాతంత్ర్య కాంక్ష యెంత యున్నదో వెల్లడియగుచున్నది. వేదములు, వేదాంగములు, కళలు అన్నియు నొకమెట్టు - ఆత్మ దేశ సంరక్షణ మొకమెట్టు. శేషశాస్త్రిగా రీఘట్టమున శివాజీయయి వ్రాసియుండిరి.


పునహాలో శివాజీకి దాదోజి రాజ్యాంగపద్ధతులు శిక్షించినాడు. ఆ శిక్షణక్రమ మిటులున్నది: