పుట:AndhraRachaitaluVol1.djvu/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కోరాడ రామచంద్ర శాస్త్రి

1816 - 1900

వేగినాటి బ్రాహ్మణుడు. కౌండిన్యసగోత్రుడు. ఆపస్తంబ సూత్రుడు. తండ్రి: లక్ష్మణశాస్త్రి. జన్మస్థానము: కేశనకుర్రు (అమలాపురం తాలూకా) నివాసము: బందరు. జననము: 1816 సం. అస్తమయము 1900 స. రచించిన తెలుగు కృతులు: 1. మంజరీ మధుకరీయ నాటిక. 2. ఉన్మత్త రాఘవము. 3. నయప్రదీపము (విగ్రహాంధ్రీకరణము). 4. రథాంగ దూతము (వచనము) - ఆముద్రితములు: 1. శాకుంతలాంధ్రీకరణము. 2. వేణీసంహారము. 3. ముద్రారాక్షసము. 4. ఉత్తర రామచరితము. 5. పరశురామ విజయము. (గద్యము) ముద్రిత సంస్కృత గ్రంథములు. 1. కుమారోదయము. (చంపూ కావ్యము) 2. ఉల్లాసములు మాత్రమే ముద్రితము) 2. ఘనవృత్తము (సంస్కృతాంధ్ర పద్యములు) 3. దేవీవిజయము (చంపువు) 4. శృంగార సుధార్ణవము 5. ఉపమావళి - ఆముద్రిత సంస్కృత కృతులు: మృత్యుంజయ విజయ కావ్యము. 2. పుమర్థసేవధి కావ్యము. 3. కరునానందబాణము. 4. రామచంద్రవిజయ వ్యాయోగము. 5. త్రిపురాసుర విజయడిమము. 6. ఉత్తర రామాయణము. 7. ధీసౌధము (వ్యాకరణ సంగ్రహము) 8. మంజరీ సౌరభము ఇత్యాదులు.

"ఉత్పత్స్యతే మమతు కోపి సమాన ధర్మా" అను నిశ్చయమున--వ శతాబ్దిలో సంస్కృతాంధ్ర గ్రంధములు రచించి క్రొత్తమార్గము తీసినపండితకవి రామచంద్రశాస్త్రి. వీరిది పండితవంశము.ఈయన అమలాపురము తాలుకాలోని కేశనకుఱ్రు గ్రామమున మాతామహుని యింట బాల్యముగడపెను. రామ మంత్రోపదేశము పొందెను. శిష్టుకృష్ణమూర్తి శాస్త్రులవారి సన్నిధి నలంకార గ్రంధములు చదివెను. మంచి సాహిత్యము సంగ్రహించెను. అంత గొంతకాలమునకు,

త్వం సాహిత్యపరోసి సాధుకవితాధుర్యోసి తేవాగ్మితా

సిద్ధా ప్రప్రజ చెన్నపట్టనపురీం విద్యాలయేహునకా