పుట:AndhraRachaitaluVol1.djvu/331

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నావయాళి తేప నాచూపులో బాప

నిలుచుగాక! తన్ను గొలుచుదాక.

అని ప్రార్థించి కృతిగానమున కుపక్రమించిరి. కవుల భాకత యను పదమున బాఠకులకు దట్టుచుండును. నిశితమైన భావనాశక్తి గల కవులు వీరని 'యేకాంతసేవ' ఘోషించి చెప్పుచున్నది. ఈ పదములు చదువుడు:

తూరుపుగోనలో దుందుభిస్వనము

వీణాన్వనంబులో వినరాకయుండె

నానందవనములో నాగస్వరంబు

నూదకే కోకిలా యొక్కింతసేపు

         *

శృంగారనదిలోన చిగురాకుదోనె

యే రాగజలధిలో నీదుచున్నదియొ

తలిరు జొంపంబులందలి గానలహరి

యే దివ్యసీమల కేగుచున్నదియొ!

పరువంపు బూపులోపలి కమ్మతావి

యేవాయుపథమునం దెగయు చున్నదియొ

తారాపథంబునందలి తటిల్ల తిక

యే మహాతేజమం దెనయుచున్నదియొ!

గాలిలో జాడలు కనిపెట్టగలుగు

దివ్యమూర్తికి నీకు దెలియదటమ్మ!

ప్రణయవనంబులోపలి పుష్పరథము

తుమ్మెదా! వేవేగ తోలితేవమ్మ!