పుట:AndhraRachaitaluVol1.djvu/295

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నికి నీహార ధరాధిరాజసుత కన్నీ రుట్ట శోకించె స్కం

దకుమారుండసురాశుగక్షతులు వొందం గుందు చందంబునన్.

ఉ. ఆదినమాదిగానె త్రిపుర్రారి ననుం గరివైరి జేసి కుం

భోదర యీహిమాద్రి గుహనుండి యిటన్ దరిజేరు జంతువున్

గాదన కారగించుచును గాపుము దీని నటంచు బంచె దో

డ్తో దయితాకపోలములతో నెలనవ్వులు వియ్యమందగన్.

వీరిగ్రంథములలో నే పట్టులు పట్టిచూచినను తియ్యని పలుకుబళ్లతో గనుపట్టుచున్నవి. ఈయన కృతు లన్నియు ననుసృతులైనను, దెనుగుసేతలో నొక క్రొత్తదన ముండి యందగించుచున్నది. మేఘదూతమునకు స్వతంత్ర గేయరూపముగా వీరుగావించిన తెలుగు పరివర్తనము వీరి కృతులు కెల్ల గిరీటము. గేయరూపముగ నున్న నేటి సలక్షణి కావ్యములకును నిది మస్తక మాణిక్యము. శ్రీ జయపురమహారాజులు శ్రీ విక్రమదేవవర్మగారి కీ కృతిని పెంపుడుబిడ్డగ నంపిరి. వారు దానిని శ్రీరామచంద్రున కర్పించుకొనిరి. ఈకృతి తొలుత 'మొయిలు మఱుగులలో శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ముచ్చటించినటులు "...యల్ల నల్లన్న విరియుచు వల్పులు గొల్పుచు నమృతబిందులొలుకు నలది రేకులవోలే సులలితములై జిలు జిలు మన జలువల జల్లుచు జవుల జిందుచు విందులు గొల్పుచు నున్న పలుకుల్ పొలుపుతో మురిపం టొయ్యారపుటూపుదోపించు శయ్యతో దేశితెలుగు తీరున గడుదియ్యమైన పాటసౌరుతో నిక నిట్లు తెలిగించు టన్యుల కసాధ్యమన దగిన ట్లున్నది......"

సీ. పువు దేనె సోనలై చెవులపండుపు సేయు

కలికిపల్కుల ముద్దులొలుక నేర్చు