పుట:AndhraRachaitaluVol1.djvu/285

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

"ఆంధ్రక్షత్రియుల" వలన బ్రత్యక్షమగును. అదేమనకు బ్రస్తుతవిషయము.

నీలాద్రిరాజుగారు అచ్చతెనుగులోను జక్కని చిక్కని కవిత సంతరింపగలరు. ఈ వృత్తాంత మీ చాటుపద్యము చాటుచున్నది.

ఉ. గూటిపులుంగులన్ మొఱగి కూళతనంబున నేయునట్టి వా

వేటలు గీటలున్ జమునివీటికి బాటలు రాచపాడికిన్

జేటులుగాక మార్తురెద జిందఱవందఱవో రొదన్ దెసల్

బీటలువాఱగాననికి బెండ్లికి బోయినయట్ల పోవలెన్

సూటి కొలందికిన్ దివియ జూచి నిగిడ్చిన మార్తుచేతివా

లీటె తనంత తావలచి యొక్కటిపై బడు పూవుబోడి మే

మీటిన చన్నుదోయి వలె మీదికి రావలెనొక్క పెట్ట పై

పాటున క్రొత్తనెత్రుకలపమ్ములు గ్రమ్మగ బేరురమ్ము నో

నాటవలెం దగం దనమనమ్మున మార్కొని ముమ్మరంపు మై

తీటలువో బెనంగవలె దేనియతేటలవోలె నెత్తురుల్

నోటబడంగ నౌడ్గఱచి మాల్కొనగావలె నీడబోని పో

రాటమునం దొడల్ విడిచి గ్రక్కున నక్కున జేర్చు వేలుపుం

జోటి చనుంగవన్ మిగుల జొక్కవలెస్మఱి పేరసంబుతో

నోటమిలేక తా బ్రతికియుండినచో మగలెల్ల వీడెపో

మేటిమగం డనంగ బుడమిం బసమీఱగ నేలగావలెన్

పాటుపడంగ నొప్పు తమపాడికి జాలక డుక్కిముచ్చులై

కూటికొఱంతలేక తిని కూర్చుని యొండరు నెక్కపక్కెపున్

మాటలనాడికొంచు వెడనవ్వులతోడన ప్రొద్దుపుచ్చి మై

పాటున నెంతయున్ జమునిపాల్పడి పోవగ మేమెమేమెపో

మేటి కొలంబువార మని మీసలు ద్రువ్వెడు రాచవారికిన్


మయ్యెనే యకట! కయ్యముతియ్యము నాడునాటికిన్

                      ___________