పుట:AndhraRachaitaluVol1.djvu/272

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జనమంచి వేంకటరామయ్య

1872 - 1933

కాశ్యపసగోత్రులు. తండ్రి: బ్రహ్మావధాని. తల్లి: మహాలక్ష్మి. నివాసము రాజమహేంద్రవరము. జననము 1872 సం. నిర్యాణము 1933 సం. కృతులు: 1. నవకుసుమాంజలి (ఖండకావ్య సంపుటము) 2. మాలతీ మాధవము 3. విద్ధసాలభంజిక (అనువాదములు) 4. సుప్రభాతము (ఖండకావ్యము) 5. మేఘదూత. 6. ఉత్తరరామ చరితము. ఇత్యాదులు.

కత్తికోతలేదు గాజుగొట్టము లేదు

మాతనెత్రు శోధసేత లేదు

ఒనరుప్రేమ బ్రకృతి యొడిజేరి చనుగ్రోలి

మేనుమఱచి నిదురెకాని కవికి.

ప్రకృతి తనుబట్టి బాధించువారి కేదొ

కడుపునకు బెట్టి కన్నీళ్లుదుడుచు గాని

దాచిపెట్టును దనపెన్నిధాన మింక

యోగమహితుడు గవివరేణ్యునకు గాను.

సుకృతిగాడె సుకవి ప్రకృతితో నేకాంత

గోష్ఠినుండు గాన కోనలందు

దవసివోలె నెపుడు తత్త్వంబె చింతించు

మధురరసము గ్రోలు మధుపమట్లు.

తత్త్వవేత్తకు నేది సత్యముగ దోచు

నదియె సౌందర్యరూపమై యమరు గవికి

జండమార్తాండ తేజ:ప్రసారమె గద

నిండుచుందురు పండువెన్నెలగ మాఱు.