పుట:AndhraRachaitaluVol1.djvu/269

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

గతి ప్రతిమాసమున సర

స్వతియే ప్రతిదేశ మేగి చాటుచునుండన్.

జగత్ర్పసిద్ధులైన యీ కింకవీంద్ర ఘటాపంచాననులను స్వసంస్థానకవులుగా జేసికొనుభాగ్యము పోలవరముప్రభువున కొక్కనికే తక్కినది.

చ. తిరిగితి మెల్లదేశము నదే పనిగా నికమీద దేశసం

చరణ మొనర్పగా వినుపు చాల మనంబున గల్గెనయ్య! యీ

తిరుపతివేంకటేశ కవిధీరుల నొక్కెడనుండజేసి భూ

పరసభలందు ఖ్యాతిని నవశ్యము చెందుమి ! కృష్ణభూవరా!.

అని చెప్పి దేశదేశములు తిరిగి విసిగివిసిగి యొకచో నుండగోరి వీరి నాశ్రయించి యుండిరని యీ పద్యమువలన దేలుచున్నది.

శ్రీ వేంకటకృష్ణరాయ కవిప్రభువు కవిపోషకుడెగాక స్వయము చక్కని కవిత చెప్పగలవాడై కొన్నికృతులుకూడ రచించెను. సంస్కృతములోని కల్హణరచితమైన 'రాజతరంగిణి' ని జక్కని వచనరచనలో సంధానించిరి. అందు దరంగ ప్రారంభమున గావించిన స్తుతులవలన నాయన కవిత సొంపుపెంపు తెలియవచ్చును.

మ. అజగోశృంగములన్ ఘటించి విలుసేయంజాలునో యెవ్వడా

త్మజు దేహంబున గూర్చెనో యెవడు మర్త్యంబు దంతిత్వమున్

నిజదేహంబున దాల్చెనో యెవడు తన్వీపుంస్వరూపంబు ల

ట్టి జగన్మాన్యు విచిత్ర కార్యకుశలున్ డెందంబున న్ని ల్సెదన్.

ఉ. పాములు నీకురుల్ రుచికి బాత్రములే మదపుంస్పికంబు నా

గోమగు తావకీన గళగోవులకు న్వికసించె జూడుమీ

పాములదృష్టియంచు నొకవాక్యము ద్వ్యర్థిగ నిర్వురాడున

-మెయి బల్కు నర్ధవనితేశ్వరు నాలుక మమ్ము బ్రోవుతన్.