పుట:AndhraRachaitaluVol1.djvu/235

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి

1866

వెలనాటి వైదిక బ్రాహ్మణులు. కౌశికసగోత్రులు. ఆపస్తంబ సూత్రులు. తల్లి: వేంకట సుబ్బ సోమిదమ్మ. తండ్రి: వేంకట సోమయాజి. జన్మస్థానము: ఎర్నగూడెమునొద్ద నున్న దేవరపల్లి. నివాసము: రాజమహేంద్రవరము. విరచితగ్రంథముల సంఖ్య యించుమించుగా 200. అందలి ముద్రిత గ్రంథములు కొన్ని:- 1. బొబ్బిలియుద్ధ నాటకము. 2. వేణిసంహారము. 3. కలభాషిణి. 4. రాజభక్తి. 5. భోజరాజ విజయము. 6. శ్రీనాథ కవిరాజీయము (నాటకములు) 7. గౌతమీ మహత్మ్యము. 8. సత్యనారాయణోపాఖ్యానము 9. గజానన విజయము 10. శ్రీకృష్ణ కవిరాజీయము. 11. సావిత్రీ చరిత్రము (పద్యప్రబంధములు) 12. బ్రహ్మానందము (అచ్చతెలుగు కావ్యము) 13. సంస్కృతకవి జీవితములు. 14. కాళిదాస విలాసము. 15. తెనాలి రామకృష్ణ చరిత్రము (వచనములు) 16. శ్రీకృష్ణ మహాభారతము (అష్టాదశ పర్వములు) 17. శ్రీకృష్ణ రామాయణము. 18. శ్రీకృష్ణమహాభాగవతము (నేటికముద్రితము), 19. గణేశపురాణము - ఇత్యాదులు. ఈ కవిని గూర్చి విపుల విషయము తెలియుటకు అనంతపంతుల రామలింగ స్వామి విరచితమైన ' శ్రీకృష్ణ కవిజీవితము ' పరికింప వలయును.

అయిదాఱేడుల యీడునం బ్రతిదినం బా భారతామ్నాయమున్ నియమం బొప్ప ఋరాణము న్వి నిచి నిర్ణిద్ర ప్రభోధాస్తి మా యగార్ధము సెప్పి తత్కధలు లో నంటింప నెంతేనియుం బ్రియ మయ్యెడి నాకు భారతముపై నిత్యానుబంధంబున్.

నేనాంధ్రంబున గించి న్న్యూనంబుగ మాఱుకృతుల నున్నతి నొందం