పుట:AndhraRachaitaluVol1.djvu/227

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పానుగంటి లక్ష్మీనరసింహరావు

1865 - 1940

మధ్వమతస్థులు. తండ్రి: వేంకటరమణాచార్యుడు. తల్లి: రత్నమాంబ. నివాసము: రాజమహేంద్రవరము, పిఠాపురము. జననము: 1865 సం. నిర్యాణము: 1-1-1940. రచితగ్రంథములు: సారంగధర చరిత్ర, వృద్ధ వివాహము, రాధాకృష్ణ, నర్మదా పురుకుత్సీయము, సరస్వతి, దుష్టప్రధాని, ఆనందనాథ, కల్యాణ రాఘవము, కంఠాభరణము, విజయరాఘవము, కోకిల, విప్రనారాయణ చరిత్ర, విచిత్ర సమావేశము, విచిత్ర మరణము, బుద్ధబోధసుధ, వీరమతి, పూర్ణిమ, ప్రచండ చాణక్యము (ఇత్యాది నాటకములు). హాస్యవల్లరి, పతనము, మంజువాణి, జగన్నాథ మూర్తి, మోసము, జలజ, సాక్షి (6 భాగములు)

సాక్ష్యుపన్యాసములు చదువనియాంధ్రు లుండరు. జంఘాలశాస్త్రి గంభీరోపన్యాసము, వాణీదాసుడు, కాలాచార్యుడు, బొఱ్ఱయ్యసెట్టిగారల మాటలును తెలుగువా రెల్ల రెఱిగినవే. వారి నాటకముల మాట యటుండనిచ్చి సాక్షివలస బానుగంటివారిని దలచుకొని నవ్వుకొనుచుందుము. ఆంధ్రప్రతికాపాఠకులు సాక్షి వ్యాసములకొఱకు గాళ్లు విఱుగద్రొక్కు కొనినదినము లెన్నియో యున్నవి. కాని పంతులుగారి షష్టిపూర్తిసందర్భమున కొకయాంధ్రు డేని నడుము గట్టినపాపాన బోలేదు. సాక్షి యాంగ్లములోని spectator అను గ్రంథమునకు డెలిసికొనజాలని ఛాయమని చెప్పుదుముగాక! అయిన నేమి? తెలుగుజాతికి 'సాక్షి' యొక యుజ్జ్వలవిజ్ఞాన దీపము. మన సంఘమును, మనజాతిని, మనవాజ్మయమును, మనదురాచారములను మెత్తమెత్తగా నెత్తిపొడుచుచు సంస్కరింపజూచిన మహాగ్రంథము 'సాక్షి'


లక్ష్మినరసింహరావుపంతులుగారు స్త్రీలు - మతము - నాగరకత - వేదాంతము - విద్యావిధానము - రాజకీయములు - మున్నగు విషయము