పుట:AndhraKavulaCharitamuVol2.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యీ సోమనాథుడు కవికి ముత్తాత. ప్రౌడదేవరాయడు హూణశకము 1422 వ సంవత్సరము మొదలుకొని 1447 వ సంవత్సరము వఱకును రాజ్యము చేసినందున, అతని రాజ్యకాలములో నుండిన సోమనాథుని మునిమనుమడు తరువాత నఱువది డెబ్బది సంవత్సరముల కుండి యుండును. కాబట్టి యీకవి 1510 వ సంవత్సరప్రాంతముల గృష్ణదేవరాయని రాజ్యారంభకాలములో నున్నాడని చెప్పవచ్చును. బసవపురాణకథానాయకుడైన బసవేశ్వరుడు శ్రీశైలమునకు పశ్చిమమున నుండు హింగుళేశ్వరాగ్రహారము నందు వాసము చేయుచుండిన శివభక్తుడయిన మండంగి మాదిరాజను బ్రాహ్మణుని పుత్రుడు. ఇతడు శివుని వాహనమైన నందియొక్క యంశముచేత భూమిమీద నవతరించెనని శైవులు నమ్ముచున్నారు. తల్లిదండ్రు లీయన కుపనయనము చేయబోయినప్పుడు చేసికోక తాను శివుని దప్ప వేఱొకని గురువునుగా నంగీకరింపనని నిరాకరించెను. ఇతడు పెద్దవాడయిన తరువాత పదునొకండవ శతాబ్దమునందు కళ్యాణపురాధీశ్వరుడుగా నున్న బిజ్జలరాజునొద్ద జేరి యాతని దండనాయకుని గూతురయిన గంగాంబను వివాహము చేసికొని కడపట బిజ్జలరాజునకు మంత్రియయ్యెను. ఈతడే యీదక్షిణ హిందూస్థానమునందు వీరశైవమతోద్ధారణము చేసినవాడు. ఈతని మేనల్లుడయిన చెన్నబసవన్న కూడ వీరశైవమును దేశమునందంతటను వ్యాపింపజేసెను. బసవపురాణమునందు బసవేశ్వరుని మహిమ లనేకములు చెప్పబడియున్నవి.

సోమనాధకవియొక్క కవిత్వరీతి జూపుటకయి కొన్ని పద్యముల నిందుదాహరించుచున్నాను:-


ఉ. ఖండశశాంక శేఖరు నఖండమహత్వమెకాని యాత్మ వే

ఱొలకు దలంప యెన్నడు పయోజభవాన్వయదుగ్ధవార్ధిచం