పుట:AndhraKavulaCharitamuVol2.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

   
   జాతౌ వీరనృసింహేంద్ర కృష్ణరాయ మహీపతి:
   అస్మాదోబాంబికాదేవ్యా మచ్యుతేంద్రోపి భూపతి.


అను శ్లోకములయందు నరసింహరాజునకు తిప్పాంబయందు వీరనృసింహరాయడను, నాగలాంబయందు కృష్ణదేవరాయడును, ఓబాంబయం దచ్యుతదేవరాయడును కలిగినట్లు చెప్పబడి కృష్ణదేవరాయని కతడు తమ్ము డయినట్టు చెప్పబడియున్నది. ఈబంధుత్వ మింకను విచారణీయము. ఒకవేళ బయి శ్లోకములలో జెప్పబడినదే నిజమయినను, నాగమ్మవలనే యోబమ్మయు శూద్రజాతమైన భోగభార్యయై యుండవచ్చును. ఈవిచారము నటుండనిచ్చి యిక గధాంశమునకు వత్తము.



క. ఆమూర్త్యంబకు నఖిల మ
   హీమండలవినుతు డిచ్యుతేంద్రుడు సుగుణో
   ద్దాముడు జనియించెను ద
   ద్భూమీపతి రంగధాముపూజన్మించెన్.


క. ఆపుణ్యఫలంబుననె ద| యాపాధోరాశియైన యాయచ్యుతభూ
   మీపతికిన్ రఘునాధ | క్ష్మాపాలకు డుదయమయ్యెజైవాతృకుడై.


చెవ్వరాజున కచ్యుతరాజును, అచ్యుతరాజునకు గృతినాయకు డయినరఘునాధరాజును బుట్టి తంజాపుర రాజ్యము పాలించిరి. విజయవిలాసములోని యీక్రిందిపద్యమువలన రఘునాధరాజు రసికజనాగ్రగణ్యు డయినట్లును, విద్యలయం దసమాను డయినట్టును తెలియవచ్చుచున్నది.


గీ. నన్ను నడిపినయధికసన్మాన మెంచి
   యఖిలవిద్యావిశారదు డగుటగాంచి