పుట:AndhraKavulaCharitamuVol2.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

    యవని నింతటిరా జెవ్వడని నుతించి
    కృతి యొసగ గీర్తికలదని మతిదలంచి.

మ. కలిగెంగా తనసమ్ముఖింబనియు సత్కారంబుతాజేయ నౌ
    దల నెంతే శిరసావహింతురనియుం దాగాక వేఱెందు సా
    ధులకున్ దిక్కనియున్ దయన్మనుపురీతుల్గాక శక్యంబె వి
    ద్యల మెప్పింపగ నచ్యుతేంద్ర రఘునాధస్వామి నెవ్వారికిన్?

రసికావతంసుడయిన కృతిపతి తన కంకితము చేయబడిన సారంగధరచరిత్రమునంతను విని యందు శోకరస మత్యద్భుతముగా వర్ణింపబడుటచూచి యది నిజముగా నేడిచినట్టే యున్నదని పలికెననియు, ఆపయిని గవి తనశక్తినంతను జూపి ప్రతిపద్య రసాస్పదముగా విజయవిలాసమును జేసి తీసికొనివచ్చి వినిపింపగా నతని యింటిపేరును బట్టి శ్లేషించి చేమకూర మంచిపాకమున బడెనని మెచ్చుకొనెననియు చెప్పుదురు. అచ్చతెలుగుపదములను పొందికగా గూర్చి కవనము చెప్పునే ర్పీకవికి గుదిరినట్లు మఱియొకకవికి గుదిరినదని చెప్ప వలను పడదు. అందుచేతనే కృతిపతి,


క. ప్రతిపద్యమునందు జమ | త్కృతి గలుగగ జెప్పనేర్తు వెల్లయెడలవై
   కృతపాఠము బాడముగా |క్షితిలో నీమార్గ మెవరికిని రాదుసుమీ.

అని కవిని శ్లాఘించి యున్నాడు. పింగళి సూర్యనార్యుని ప్రభావతీప్రద్యుమ్నమునకు దరువాత విజయవిలాసమే సర్వవిధములచేతను తెలుగులో శ్లాఘ్యకావ్యముగా నున్నది. జాతీయాదిచమత్కృతిని బట్టి విజయవిలాసమే శ్లాఘ్యతర మయినదనియు ననేకు అభిప్రాయపడు చున్నారు.


ఉ. తారసవృత్తిమై ప్రతిపదంబును జాతియు వార్తయుం జమ
   త్కారము నర్థగౌరవముగల్గ ననేకకృతుల్ ప్రసన్నగం