పుట:AndhraKavulaCharitamuVol2.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

   మూర్తిమాంబను బెండ్లియై కీర్తి వెలసె
   జెవ్వవిభుడు మహోన్నతశ్రీ చెలంగ.

అను విజయవిలాసములోని పద్యమునుబట్టి యీచెవ్వరాజు విజయనగరాధీశ్వరుడైన యచ్యుతదేవరాయనికి దోడియల్లు డయినట్టు కనబడుచున్నాడు. అయినను వేంకటకవి చెవ్వరాజు మనుమడైనకృతిపతి యగు రఘునాథరాజు నాశ్వీర్వదించుచు


మ. ప్రకటశ్రీహరియంఘ్రి బుట్టి, హరుమూర్ధం బెక్కి యింపార మ
    స్తకముం బేర్కొన నెక్కుదేవి సహజోదంచత్కులోత్పన్న నా
    యకరత్నం బని యచ్యుతేంద్రరఘునాథాధీశ్వరస్వామికిన్
    సకలైశ్వర్యములు న్ని జేశువలనం దా గల్గగా జేయుతన్.


శూద్రునిగా వర్ణించినందున శూద్రకులసంజాతు డగు చెవ్వరాజునకును క్షత్రియవంశ జాతు డగు నచ్యుతదేవరాయనికిని బంధుత్వముండునా యని సందేహము తోచుచున్నది. మొట్టమొదట కృష్ణదేవరాయలే యుత్తమక్షత్రియుడు గాక దాసీపుత్రు డయినట్టు వాడిక గలిగియున్నదిగదా! క్షత్రియుడైన నరసింహరాజునకు దాసియు శూద్రయు నగు నాగాంబకుబుట్టిన కృష్ణదేవరాయనికి మొట్టమొదట క్షత్రియులెవ్వరును గన్య నియ్యనందున, అతడు శూద్రజాతి స్త్రీని గాంధర్వవిధిచే వివాహమాడి యచ్యుతదేవరాయని పుత్రునిగా బడసి యుండవచ్చును. అందుచేత నాయచ్యుతదేవరాయడు శూద్రకన్యనే పెండ్లిచేసికొనియు నుండవచ్చును.పెక్కు శాసనములలో నచ్యుతదేవరాయడు కృష్ణదేవరాయనికి కుమారు డైనట్టు చెప్పబడినను, శాలివాహనశకము 1459 హేవిళంబి సంవత్సరమున నచ్యుతదేవరాయ లొక బ్రాహ్మణునికి నారాయణపురము నగ్రహారమునుగా నిచ్చిన దానశాసనములో,


శ్లో. తిప్పాజీ నాగలాదేవ్యో కౌసల్యాశ్రీసుమిత్రయో