పుట:AndhraKavulaCharitamuVol2.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉ. కౌరవనాథ యే గలుగగా గలశీతనయుండు గల్గగా

బౌరుషసింహమూర్తులగు బాహ్లికముఖ్యులు కల్గియుండగా

నూరక కుందె దేటి కిది యోధులచందమె శీరసాధనున్

వారణచేసి సాంబు నని వ్రాలిచి లక్షణ దెత్తు గ్రమ్మఱన్. [ఆ.5]

                              _____

25. మట్ల అనంతభూపాలుడు

ఈక్షత్రియకవి కాకుస్థవిజయ మనెడి యైదాశ్వాసముల ప్రబంధమును రచియించి తనతండ్రి యైన యెల్ల భూపాలున కంకితముచేసెను. తనతండ్రి సభాసీనుడయి యభినవాంధ్రకవితాపితామహు డైనయుప్పుగుండూరిపురి వేంకటకవినిజూచి శాశ్వతమగు ధర్మ మెద్దియని యడుగగా నక్కవికంఠీరపు డిట్లనియెనని తనకృత్యాదిని వ్రాసికొనియున్నాడు-


ఉ. కోనయయెల్ల వైరినృపకుంజరభంజన కంజదళాక్షసే

వానిరపద్య యాద్యజనవల్లభనీతిసార యౌ

రా నవఖండ రాజర సనాంచలరంగముల న్నటింప ద

న్మానసగర్వపుందెర దెమల్చి యమర్చితి కీర్తినర్తకిన్.


శా. థారాపాతము వాసినప్పుడు ఘనత్వం బేర్పడున్ జంద్రహా

సారూడి న్విలసిల్లుచున్నపుడ శైత్యం బెల్ల గాన్పించు రా

నీరాజద్భుజఖడ్గరాజ మభివర్ణింప న్వశంబే మహో

గ్రారిధ్వంసక మట్ల కోనవిభునెల్లా రాజకంఠీరవా.


గీ. అమితచారిత్ర పుణ్యమార్గములు గలవు

పెక్కులయ్యును సత్కీర్తి కెక్కుననియ

సప్తసంతానములు నందు శాశ్వతంబు

కావ్య మందుము సత్కవి కలిగె నీకు.