| నొక్కనాడు దేవలోకంబుననుండి యొక్కదూత వచ్చి సముచితప్రకారంబునం | 245 |
సీ. | వసుమతీభారంబు వారించుకొఱకునై మనుజవేషమున జన్మంబుఁ బొంది | |
తే. | మనుజలోకసుఖంబులు మాని నీవు, పరమపదమున కరుగుము పద్మనాభ | 246 |
వ. | అనిన నాదేవదూతకు వాసుదేవుం డిట్లనియె. | 247 |
క. | దేవేంద్రునివచనస్థితి, గావించెద యాదవప్రకాండమునెల్లన్ | 248 |
ఆ. | ఏను బరమపదము కేతించుచున్నాఁడ, నివ్విధంబుఁ జెప్పు మింద్రుతోడ | 249 |
వ. | అంత యాదవులు విష్ణుమాయాప్రేరితులై సముద్రతీరంబునఁ బ్రభాసతీర్థంబునఁ | 250 |
తే. | ఆపయోనిధితీరంబునందు మొలిచి, యున్నముయ్యంచుతుంగ మహోగ్రగతులఁ | 251 |
వ. | ఇట్లు నీరవశేషంబుగా యాదవలోకంబు పరలోకప్రాప్తిం బొందె. | 252 |
తే. | శంఖచక్రగదాశార్ఙ్గసాధనములు, హరికి వలగొని మ్రొక్కి మాయమును బొందె | 253 |
సీ. | అప్పుడు బలభద్రుఁ డలసుఁడై యొకతరుచ్ఛాయఁ గూర్చుండె నాసమయమునను | |
తే. | బూజ లిచ్చుటయును బ్రీతిఁ బొంది నాక, లోకమున కేగుటయుఁ బద్మలోచనుండు | 254 |