క. |
తనయుండు తప్పుచేసిన, జనకుఁడు తగుబుద్ధి చెప్పఁ జనుగాక రణం
బున నిట్లు పగతుకైవడి, మనమున దయలేక పిలుకుమార్పం దగునే.[1]
| 101
|
వ. |
అనిన నవ్విశ్వంభరుండు విశ్వంభర కిట్లనియె.
| 102
|
ఉ. |
నాదెస భక్తిచాలనిజనంబులు చుట్టము లైన నేమి కం
సాదుల యట్ల చంపుదు మదాప్తచయంబు లలంతులైన ప్ర
హ్లాదవిభీషణాదిసుకృతాత్ములకైవడి నాదరింతు శా
తోదరి పుణ్యశీలుఁడు మహోన్నతిఁ బొందఁడె యేయుగంబులన్.[2]
| 103
|
వ. |
కావున సకలలోకాపకారి యగునరకాసురుండు వధకు నర్హుండుగాని పుత్ర
స్నేహంబున రక్షింపందగఁడు వీనికై శోకింపఁదగదు నేను భూమిభారం బుడి
గింప మనుష్యరూపంబున నవతరించుట నీ వెఱుంగవే యనిన ధరణి ధరణీధరున
కిట్లనియె.
| 104
|
క. |
నరకుఁడు చేసినతప్పును పరికింపక వానిసుతుని బహురాజ్యరమా
భరితునిఁగాఁ బాలింపుము, శరణాగతరక్ష యనుచుఁ జాగిలి మ్రొక్కెన్.
| 105
|
ఆ. |
శౌరి యాధరిత్రి కోరినలాగున, నరకసుతుని రాజ్యభరితుఁ జేసి
నదితికుండలము లమ్మురారాతికి, నిచ్చి యాలతాంగి యేగుటయును.
| 106
|
శతాధికషోడశసహస్రకన్యాపరిగ్రహేంద్రలోకగమనాదిశ్రీకృష్ణదివ్యచరితానువర్ణనము
వ. |
కృష్ణుండు ప్రాగ్జ్యోతిషపురంబు ప్రవేశించి నరకాసురసంపాదితంబు లైనశతాధి
కషోడశసహస్రకన్యాజనంబులను చతుర్దంతదంతావళంబు లాఱువేలును సర్వల
క్షణసంపన్నంబు లైనకాంభోజహయంబులు రెండువేలును మనోహరంబు లైన
కనకరత్నరాసు లసంఖ్యంబులును నరకకింకరులచేత ద్వారకానగరంబున కనిచి
పుచ్చి.[3]
| 107
|
క. |
వరుణునిగొడుగును మందర, గిరి మణిశృంగంబు గొనుచు గిరిరిపుఁ జూడన్
హరి యేగె గరుడవాహన, పరిశోభితుఁ డగుచు సత్యభామయుఁ దానున్[4].
| 108
|
మ. |
చని దేవేంద్రపురోపకంఠమున నాసర్వంసహామండలా
వనకేళీరతుఁ డైనకేశవుఁడు దుర్వారధ్వనుల్ దిక్కు లె
ల్లను భేదింపఁగఁ బాంచజన్య మవలీలన్ బిట్టు పూరించినన్
విని బృందారకవల్లభుండు ప్రమదావిర్భూతచేతస్కుఁడై.[5]
| 109
|
క. |
కొనిపోయి రత్నసింహా, సనమున నాసీనుఁ జేసి జలజాక్షున క
య్యనిమిషపతి యర్ఘ్యాదులు, తనగురుఁ డగుగురునిచేతఁ దగఁ గల్పించెన్.
| 110
|
తే. |
ఇట్లు పూజితుఁడై యాదవేశ్వరుండు, తీపు లొలికెడుసరససల్లాపవిధులఁ
|
|
- ↑ పగతుకైవడిన్ = శత్రువువలె, పిలుకుమార్పన్ = చంప.
- ↑ నాదెసన్ = నాయందు, అలంతులు = అల్పులు.
- ↑ దంతావళంబులు = ఏనుఁగులు.
- ↑ గిరిరిపు = ఇంద్రుని.
- ↑ ఉపకంఠమునన్ = మొగసాలయందు, ప్రమదావిర్భూతచేతస్కుఁడు = సంతోషము పుట్టిన మనసుగలవాఁడు.