|
నియమించి కృష్ణునితో వైరానుబంధంబుననైన కోపంబు ప్రేరేప శుద్ధాంతమంది
రంబునకుం జని యుచితమార్గంబున నుండి మఱునాఁడు ప్రభాతసమయంబున.[1]
| 397
|
శ్రీకృష్ణబలభద్రులు కువలయాపీడం బనుగజంబును చాణూరముష్టికు లనుమల్లులను చంపుట
ఉ. |
తమ్ములు బంధుమిత్రులును దాను నమాత్యచయంబు రాజలో
కమ్మును బౌరులుం గొలువఁ గంసుఁడు రంగసమీపతుంగమం
చమ్మున నెక్కి యుండెను విశాలసమున్నతభర్మరమ్యహ
ర్మ్యమ్ములనుండి చూడఁగఁ బురాంగనలున్ మఱి రాజపత్నులున్.[2]
| 398
|
వ. |
మఱియు వసుదేవాక్రూరాదియాదవులును నందాదిగోపకులును మొదలుగా
సమస్తజనంబులును ప్రదేశంబులఁ జూచుచుండిరి. మల్లయుద్ధసన్నద్ధ
చాణూరముష్టికాదివీరులు మల్లప్రాశ్నికులతోడ రంగమధ్యంబు ప్రవేశించిరి.
కువలయాపీడగజేంద్రంబుతోడ మావంతుండు వచ్చి రంగద్వారంబున నొలసి
యుండె. సమస్తసైన్యంబులును జతురంగసమేతంబుగాఁ గట్టాయితంబయి
యుండె. అప్పుడు రాజానుమతంబున బలసి బలభద్రదామోదరులు గోపాల
కుమారులతోఁ గూడవచ్చి రంత.[3]
| 399
|
సీ. |
కంసచాణూరాదికపటాయితశ్రేణి కలఁగుచు మృత్యువుగాఁ దలంప
సురపథంబుననుండి చూచి వియచ్చరౌఘము పరదైవముగాఁ దలంపఁ
గృతకృత్యు లగు దేవకీవసుదేవులు గరువంపుఁబుత్రుడుగాఁ దలంప
గోపాంగనాజనకోటి మోహనరూపకందర్పనిభమూర్తిగాఁ దలంపఁ
|
|
తే. |
గోరి యాభీరదారకకోటి తమ్ముఁ, గలసి యాడెడు చెలికానిఁగాఁ దలంప
భూమిభారావతరణుఁడై భుజగనాథ, శయనుఁ డరుదెంచె బలభద్రసహితుఁ డగుచు.[4]
| 400
|
ఉ. |
ఏవున రామకేశవుల నెక్కటి మార్కొని బాహుశౌర్యముల్
చూపెడుమల్లు రెవ్వ రనుచున్ జనులెల్లఁ దలంచుచుండఁగాఁ
బాపవిచారులై యచటిప్రాశ్నికవర్గము కంసుచే నను
జ్ఞాపరులై సమస్తజనసంఘములున్ వెఱఁగందిచూడఁగన్.
| 402
|
క. |
నారాయణుతోడను జా, ణూరుఁడు మఱి రోహిణీతనూజునితో దు
ర్వారబలుఁ డైనముష్టిక, వీరుఁడు యుద్ధంబు సేయ విభజించుటయున్.
| 403
|
వ. |
అచ్చటి పెద్ద లయ్యుద్దులం జూచి.
| 404
|
- ↑ గంధసింధురము = మదపుటేనుఁగు, కట్టాయితంబు = మిక్కిలి సిద్ధపడినది, శుద్ధాంతమందిరంబునన్ = అంతఃపురమునందు.
- ↑ భర్మహర్మ్యమ్ములనుండి = బంగారుమేడలలోనుండి.
- ↑ ప్రాశ్నికులతోడన్ = సభికులతో, కలిసి = కూడి.
- ↑ ఆభీరదారకకోటి = గొల్లపిల్లకాయలగుంపు.