చ. |
ఒలసినవేడ్క నానానృపతి యొక్కముహూర్తమునందు లక్షభా
ర్యల వరియించి యందఱకు నన్నివిధంబుల నిష్టసౌఖ్యముల్
సలుపుచునుండు నొక్కొకవిలాసిని వేవురు వేవురాత్మసూ
సులఁ గనఁగా జగన్నుతఘనుల్ పదికోట్లతనూజులై రొగిన్.[1]
| 207
|
ఉ. |
నీతివివేకధుర్యగుణనిర్మలులై పదికోట్లపుత్రులున్
భూతలమంతయున్ నిజవిభూతి యెలర్పఁగ నేలుచుండఁగా
నాతతచక్రవర్తి మహిమాతిశయంబున నేడుదీవులుం
బ్రీతి వహింప నేలె శశిబిందుఁడు సాధుజనైకవిందుఁడై.[2]
| 208
|
ఉ. |
ఆపదికోట్లపుత్రులకు నగ్రజుఁ డైనపృథుశ్రవుండు ధా
త్రీపతి యయ్యె నానృపవరేణ్యునకుం దముఁ డుద్భవించె నా
భూపకులావతంసునకుఁ బుత్రకుఁడై యుశనుండు పుట్టె వాఁ
డేపున దక్షిణల్ ద్విజుల కిచ్చి యొనర్చె దశాశ్వమేధముల్.[3]
| 209
|
మణిగణనికరవృత్తము. |
ఉశనునిగతిమతియుతుఁ డనఁదగు న
య్యుశనునకును దనయుఁడు గలిగె జగ
ద్విశదయశుఁడు జనవినుతుఁడు కరుణా
తిశయుఁడు నితవుఁడు దినకరనిభుఁ డై.
| 210
|
వ. |
వానికి మధుండు పుత్రుండయ్యె వానికిఁ బరాజితుండును రుతుండును పృథు
రుక్తుండును జ్యామఘుండును పలితహరితుండును నన నేవురు పుత్రులైరి
వారియందు.
| 211
|
తనపుత్రుం డగువిదర్భునకు వయోధికస్త్రీని పెండ్లి సేసిన జ్యామఘునివంశానుక్రమము.
క. |
జ్యామఘుఁడు శైబ్య యనుకాం, తామణి వరియించి తాను దానికి వశుఁడై
యామగువ దనకు నేలిన, స్వామివిధంబునను రాజసంబున నుండెన్.[4]
| 212
|
క. |
భామినులకు వశులై యీ, భూమండలిలోనఁ దిరుగుపురుషులలోనన్
జ్యామఘుఁడె యెక్కు వనుచును, వేమఱుఁ జెప్పుదురు జనులు విచ్చలవిడితోన్.
| 213
|
క. |
ఆలు దనరాజ్యమంతయుఁ, బాలించఁగ దానిఁ గొల్చి బంటై యుండెన్
లీలఁ దనవంటిరాజులు, మేలంబున నపహసింప మెలఁగుచు వేడ్కన్.[5]
| 214
|
వ. |
ఇట్లు భార్యావశుండై జ్యామఘుండు సంతానార్థంబుగాఁ దపంబు సేయం
జనుటయు.
| 215
|
- ↑ ఒలసిన = పొందిన.
- ↑ ఆతత = అధికతరమైన, సాధుజనైకవిందుఁడు = సాధువులైన జనులచేతనే తెలియఁబడువాఁడు.
- ↑ భూపకులావతంసునకు = రాజవంశశ్రేష్ఠునకు.
- ↑ స్వామి = ఒడయఁడు.
- ↑ మేలంబునన్ = సరసత్వముతో.