రజియనువాని కింద్రపదము వచ్చుట
వ. |
అయ్యలర్కునిపుత్రపౌత్రాంతరంబు లనేకతరంబులు గలిగె వారియందుఁ జాతు
ర్వర్ణ్యంబులు ప్రవర్తిల్లె నిది కౌశేయవంశప్రకారం బని వెండియు.
| 149
|
క. |
అనఘాత్మ విను పురూరవు, మనుమం డగురజి ప్రతాపమహితుల సుతులం
గనియెను బంచశతకముల, ననిమిషపతి నైన గెల్చు నతిబలయుతులన్.
| 150
|
శా. |
ఆకాలంబున దేవదానవులు ఘోరాకారసంగ్రామకే
ళీకౌతూహలచిత్తులై యరిగి నాళీకాసనుం గాంచి దే
వా కయ్యం బొనరింపుచో జయమునన్ వర్తిల్లువా రెవ్వరో
మాకుం జెప్పుమటన్నఁ బద్మజుఁడు సమ్యగ్బుద్ధితో నిట్లనున్.[1]
| 151
|
క. |
నిజము పురూరవుమనుమఁడు, రజి యెవ్వరివంక నిలిచి రణరంగములో
భుజబలముఁ జూపు వారలె, విజయముఁ జేకొందు రనుచు వినిపించుటయున్.[2]
| 152
|
క. |
అనిమిషులకంటె ముందఱ, దనుజులు సనుదెంచి రాజతనయునిఁ బ్రార్థిం
చిన నతఁడు వారినందఱిఁ, గనుఁగొని యిట్లనియె వినయగౌరవ మొప్పన్.
| 153
|
క. |
అనిలోన మీకుఁ దోడై, యనిమిషులను గెలిచి విజయ మనురాగముతో
నొనరింతునేని మీ కిం, ద్రునిఁగా నను జేయనోవుదురె మీ రనినన్.
| 154
|
క. |
మాకెల్లఁ గర్త పుణ్య, శ్లోకుఁడు ప్రహ్లాదుఁ డతనిశుభముకొఱకె పో
యీకయ్య మిట్లు గాదని, నీ కింద్రత్వంబు నొసఁగ నేర్తుమె యనుచున్.
| 155
|
ఆ. |
ఇయ్యకొనక దనుజు లేగిరి పదపడి, యమరవరులు వచ్చి యసురవీరు
లట్ల వేఁడుకొన్న నారాజు దైత్యులఁ, బలికినట్ల సురలఁ బలుకుటయును.[3]
| 156
|
వ. |
నిలింపులు దమలో విచారించి కార్యదాహంబునం జేసి దేవేంద్రత్వం బతని కిచ్చు
టకు వొడంబడిరి రజియును దేవసైన్యసహాయుండై రణంబున దైత్యదానవుల
మర్దించి విజయంబుఁ గైకొనియున్న యతనిపాలికిఁ బురందరుండు వచ్చి సాష్టాంగ
దండప్రణామం బాచరించి చేతులు మొగిచి యిట్లనియె.[4]
| 157
|
చ. |
కడుభయ మైనవేళఁ గృపఁ గాచిన యాతఁడుఁ గన్నతండ్రియున్
జడియక యొక్కరూ పగుట సత్యము దుష్టవిరోధికోటిచే
బొడమిన భీతి మాన్పి దయఁ బ్రోచితి గావునఁ దండ్రి నీవు నే
కొడుకను నీమహామహిమకుం దగువాఁడనె కాక లాఁతినే.[5]
| 158
|
ఆ. |
ఇంతకంటె నీకు నింద్రత్వ మేటికి, నేమి ఘనము మానవేంద్రచంద్ర
నన్నుఁ గరుణఁ జూచి నాలోకమున నిల్పి, యలరఁజేయుమన్న నవ్విభుండు.
| 159
|
మ. |
పగవాఁడైనను వచ్చి క్రిందుపడి తాఁ ప్రార్థించినన్ వానికిం
|
|
- ↑ సంగ్రామకేళీ = యుద్ధక్రీడయందు, నాళీకాసనున్ = బ్రహ్మను, సమ్యగ్బుద్ధితో = మంచిబుద్ధితో.
- ↑ వంక = తట్టు.
- ↑ దైత్యుల బలికినట్ల = రాక్షసులతో చెప్పినట్టె.
- ↑ నిలింపులు = దేవతలు, కార్యదాహంబునం జేసి = (పొసఁగిన) కార్యమువలని సంతాపముచేత.
- ↑ జడియక = తప్పక యనుట.