|
సోమునిపుత్రుఁడో గురునిసూనుఁడో నా కెఱిఁగింపుమన్న నీ
సోమసుతుండు గాని గురుసూనుఁడు గాఁడని పల్కె నేర్పడన్.
| 61
|
వ. |
ఇవ్విధంబునం బలికినయప్పలుకులు విని బృహస్పతి కుమారునియందు మోహం
బు విడిచి పత్నీసమేతుండై యరిగె మహాదేవపితామహప్రముఖు లైనదేవర్షి
గణంబులు నిజనివాసంబులకుం బోయిరి. చంద్రుండును నక్కుమారు నాలింగ
నాదివిశేషంబుల గారవించి బుధుం డనునామధేయంబు చేసి నిజభార్య యైన
రోహిణీదేవి కిచ్చిన.
| 62
|
తే. |
రోహిణీదేవి యక్కుమారునకుఁ గన్న, తల్లికంటెను మిగులఁ దాత్పర్యవృత్తి
నడపి పెంచుచు నుపలాలనంబు చేసెఁ, జంద్రుఁ డెంతయు నాత్మలో సంతసిల్ల.
| 63
|
ఆ. |
బుధుఁడు తపము చేసి యధికతేజోనిధి, యగుచు గ్రహపథంబునందు నిలిచి
నతఁడు మనుతనూజయగు నిళయందుఁ బు, రూరవుండు నాఁగుమారుఁ గనియె.
| 64
|
పురూరవుండు ఊర్వశీరక్తుండై విహరించుట
సీ. |
భూభరణక్రియాస్ఫురణఁ గుంభీనసక్రోడేభములనైనఁ గొంచెపఱచు
దానవైఖరిఁ గామధేనుకల్పద్రుమచింతామణులనైన సిగ్గుపఱచు
సౌందర్యమున సురేశ్వరతనూభవసోమపంచబాణులనైన భంగపఱచు
విమలధైర్యంబున హిమమహీధరమేరుమందరాదులనైనఁ గ్రిందుపఱచు
|
|
తే. |
దీవు లేడింటఁ దనయాజ్ఞ దేజరిల్ల, నిజచరిత్రంబు భావిభూభుజుల కెల్ల
మేలుబంతిగా వసుంధర యేలుచుండె, భూరివిక్రముఁ డైనపురూరవుండు.[1]
| 65
|
వ. |
అట్టి పురూరవుండు నిజరాజధాని యైనప్రతిష్టానపురంబున రాజ్యంబు సేయు
చుండి యొక్కనాఁడు.
| 66
|
సీ. |
మందారచందనమాకందశాకోటజంబీరనీపకదంబతరులు
మల్లికామాధవీమాలతీచంపకకుందాదిసంఫుల్లకుసుమలతలు
కలనాదకలహంసికాచక్రవాకవిస్తారకాసారకాసారములును
గీరపారావతళాశారికామృడభంగపరపుష్టపరితుష్టపరిచితంబు
|
|
తే. |
మందమలయానిలోద్ధూతమానసుమప, రాగధూసరితాకాశభాగతలము
గలిగి వనదేవతాసముత్కరమనోభి, రామమై యొప్పుచున్న యారామములను.[2]
| 67
|
వ. |
ఇట్టివినోదంబులం దగిలి వినోదించుచున్న సమయంబున.
| 68
|
సీ. |
తనకొప్పులోని కమ్మనిపూవుతావులసొబగు దిక్కులనెల్ల పోడుముట్టఁ
దననీడువాలునేత్ర ముల యల్లార్పుచూపులు పాంథజనుల గుండెలు పగుల్పఁ
|
|
- ↑ కుంభీనసక్రోడేభములన్ = ఆదిశేషుని ఆదివరాహమును అష్టదిగ్గజములను, సురేశరతనూభవసోమపంచబాణులన్ = జయంతుని చంద్రుని మన్మథుని.
- ↑ శాకోట = వెల్లతేఁకుచెట్టు, నీప = కడపచెట్టు.