పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సప్తమౌనులు వెలసిరి చైత్రచిత్ర, మదనకింపురుషాదు లమ్మనువుసుతులు.

6


వ.

ఉత్తమమన్వంతరంబున సుశాంతుండు దేవేంద్రుండయ్యె. సుధామసత్యశివప్రత
ర్దనవశవర్తు లను ద్వాదశగణంబులు దేవతలు తొల్లి నీకుం జెప్పిన వసిష్ఠతనయు
లేడ్గురు సప్తమహర్షు లైరి మఱియును.

7


సీ.

నాలవమనువు నానాలోకనుతకీర్తి యయ్యొప్పెఁ దామసుఁ డనుమహాత్ముఁ
డతనికాలంబున నమరాధిపతి యయ్యె శిబి యనునాతండు విబుధవరులు
హరసత్యరూపాదు లన సప్తవింశతిగణములై మెఱసిరి కావ్యచైత్ర
పృథుకావ్యవర్ణాగ్నిపీవరజ్యోతిధాములు సప్తమానులై రలఘుమతులు


ఆ.

ఖ్యాతిజానుజంఘకేతురూపనరాది, మనుజనాథవరులు మనువుతనయు
లమ్మహానుభావు లత్యంతధర్మాత్ము, లైరి పెక్కుక్రతువు లాచరించి.

8


తే.

రైవతాహ్వయమన్వంతరంబునందు, విభుఁ డనెడువాఁడు దేవతావిభుఁడు దేవ
గణము లమితాభవైకుంఠకావ్యభూత, దయు లనంగఁ జతుర్దశద్వయము వెలసె.

9


తే.

ఊర్ధ్వబాహుఁడు దేవబాహుఁడు హిరణ్య, రోముఁడును వేదవంతుండు థామకుండు
శ్రీమతుండు పర్జన్యుఁడు నా మునీంద్ర, సప్తకము సప్తమును లై రి సంయమీంద్ర.

10


క.

బలబంధూజ్జ్వలసంభా, వ్యులు మొదలుగ రాజులందు నొగి మనువుకుమా
రులు దేవేంద్రుని వెన్ను, ద్దులగతి విలసిల్లి రధికదోర్బలమహిమన్.

11


ఉ.

ఏచినయాప్రియవ్రతమహీతలనాథుఁడు తొల్లి పుష్పనా
రాచగురుం గుఱించి యనురాగముతోఁ దప మాచరించి స్వా
రోచిషుఁ డాదియౌ నలువురుం దనవంశజులై వెలుంగఁ బు
ణ్యోచితవృత్తిఁ దాఁ బడసె నుజ్జ్వలరాజ్యరమావిభూతితోన్.[1]

12


క.

ఆతనివిమలతపోమహి, మాతిశయమువలన మనువులై వెలసిరి యీ
భూతలనాయకు లతులవి, భూతిక విలసిల్లి రవనిఁ బుణ్యోదయులై.

13


వ.

మఱియు షష్ఠం బైన చాక్షుసమన్వంతరంబునకు మనోజవుం డను దేవేంద్రుం
డును, నార్య ప్రభూతభవ్యపృథుకరేఖాదు లైనయష్టకాగణంబులు దేవతలను,
సుమేధుండును విజరుండును హవిష్మంతుండును నుత్తముండును మధుండును
సహిష్ణుండును అతినామకుండును అనువారలు సప్తమహర్షులును, పూరుశత
ద్యుమ్నప్రముఖు లైనవారలు మనుకుమారులు నై విలసిల్లిరి. తదనంతరంబ.

14


తే.

అనఘ సాంప్రతమైనమన్వంతరమున, కధిపుఁడై విలసిల్లె నయ్యనఘమూర్తి

  1. పుష్పనారాచగురున్ = మన్మథునితండ్రిని - విష్ణువును.