| మాతయై విలసిల్లు మంత్రంబుచే భక్తి నర్ఘ్యంబు లిచ్చుచో నాజలములు | |
తే. | యగ్నిహోత్రంబులను బ్రథమాహుతుల వి, కర్తనాప్యాయనం బయి కడునతనికి | 180 |
క. | కావున బ్రాహ్మణులకు సం, ధ్యావిధు లొనరింపవలయుఁ దత్కాలమునన్ | 181 |
ఆ. | కాల మెఱిఁగి సంధ్య గావింపనేరక, యగ్నిహోత్రవిధియు నాచరింప | 182 |
వ. | ఇట్లు భగవంతుం డైనయంశుమంతుండు పరమవైఘానసు లయినవాలఖిల్యాది | 183 |
తే. | సప్తమునిమండలముమీఁద శతసహస్ర, యోజనంబులపొడవున నుండు ధ్రువుఁడు | 184 |
సీ. | సంతతంబును గాలచక్రమధ్యమున వేదియుఁబోలె ధ్రువుఁ డెందుఁ దేజరిల్లు | |
- ↑ భూసురోత్తములు = బ్రాహ్మణశ్రేష్ఠులు, వైదికప్రణవపూర్వముగన్ = వేదసంబంధియైన ప్రణవము ముందు కలుగునట్టుగా - తొలుత ప్రణవము నుచ్చరించుచు ననుట, వేదమాత = గాయత్రి, అర్ఘ్యంబులు = మంత్రోదకములు, వజ్రంబులు = వజ్రాయుధములు, తేజంబు గావించు = తేజస్సు కలుగఁ జేయును, యామినీచరశ్రేణికిన్ = రాక్షససమూహమునకు, ప్రాణహాని = చావు, వికర్తనాప్యాయనంబయి = రాక్షసులయొక్క రాయిడివలని బడలిక తీఱి, మయూఖంబులు = కిరణములు, భువనము = అశోకము.
- ↑ అంశుమంతుండు =సూర్యుఁడు, వైఘానసులు = విష్ణుభ క్తులు, సంరక్షితుఁడు = లెస్సగా రక్షింపఁబడినవాఁడు, పర్యాయంబున్ = క్రమముగా, కాలపంచకంబు = కాలములయొక్క అయిదు - అయిదుకాలములును, యోగ్యంబులు = తగినవి.
- ↑ బ్రహ్మవిదులు = పరతత్వము నెఱిఁగినవారు.