xv
భంగము లేదు. తేల్చి యర్ధబిందువున్నచోటఁ జదివినట్లు చదువవచ్చును. కాని పూర్ణబిందు పూర్వకప్రాసస్థానమున దీర్ఘముమీఁదిబిందువు నూఁది పలుకవలయును. ఇది యాధునికకవుల గ్రంథములలో లేదు. కాని ప్రాచీనకవులగ్రంథములలోఁ గేతనకాలపుఁగవులగ్రంథములలోఁ గొన్నిచోట్లఁ గలదు. క్వాచిత్కమగుటచే రెండుస్థలములు చూపుచున్నాను.
ఉ. "వీంగు నపారసత్యగుణవిస్ఫురణం బరమేశ్వరోరువా
మాంగమునందు......................................................
లోంగిన............................................................వే
దాంగు ననంతు.....................................................".
క. "పోంకనలి నీరజస్వల
సోంకిన దోషంబువాయ సూర్యుఁడు గవితా
శంక నపరాంబుధిలోఁ
గ్రుంకెనొకోయనంగఁ బ్రొద్దు గ్రుంకుడునంతన్."
నన్నెచోడుని కుమారసంభవము.
తర్వాత కవులుగూడ కొంద ఱుపయోగించిరి. "కాంతకుమదిఁ బుట్టెడుతల పోంతలతో..." కాలిందీకన్యాపరిణయము. ఇట్టివి అరుదుగాఁ గలవు.