నన్నయపాటించిన యతిస్థలమునకు పూర్వము రెండుఇంద్రగణములు ఒక సూర్యగణము మరియొక ఇంద్రగణము ఉండవలెనని గదా అనుకొంటున్నాము. ఆసూర్యగణము మూడవచోటనే కాక మరియొకస్థలమునందైనా ఉండవచ్చునని నన్నయ అభిప్రాయమేమో! చూడండి:--
| తనదివ్య శక్తిన ప్పాశముల్ విడిచి + తన్మునినాథు | |
ఇట్లు సమాధానము చెప్పి ఇటువంటి పాదములకు లక్షణము నిరూపించవచ్చును గాని ఇదమిత్థమని చెప్పలేము. చాలా వ్రాతప్రతులు జాగ్రత్తగా పరిశీలించి విమర్శించవలసి ఉన్నది.
“పదుండ్ర బోలెడు...” (ఆర. II. 343) ఈపద్యమున మొదటి రెండు చరణములలోను జగణమున్నది. ఇది మనవారు చెప్పిన సూర్యేంద్రచంద్రగణములలో గాని, కన్నడమువారు