పుట:Anandam Manishainavadu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రియాలిటీ షో

అది రామచంద్రాపురం (తూ||గో||జిల్లా) బస్టాండ్. అప్పటికి రాత్రి 8:00 గంటలైంది. ఓ వ్యక్తి గట్టిగా కేకలేయడం మొదలుపెట్టాడు. "దమ్ముంటే రండెహే" అని అరుస్తున్నాడు. కొందరు అతని వాలకం చూసి కంగారు పడుతున్నారు. కొందరు నవ్వుకుంటున్నారు. ఆ గుంపులో ఉన్న ఇద్దరు "ఒరేయ్ ఇందాక స్టేజి మీద మిమ్రికీ చేసిన లెక్చరర్ ఆయనే కదరా, ఏం చదివితే ఏం లాభం, అప్పుడే తాగేసి గందరగోళం చేస్తున్నాడు చూడు" అనుకుంటున్నారు. కొంతసేపు అయ్యాక ఆ వ్యక్తి శాంతించాడు. అప్పుడు "ఏం రవణా ఎలా ఉంది మినీ రియాలిటీ షో" అనడంతో అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. "ఇదంతా సరదాగా చేసిన పనా" అన్నారు వారిలో కొందరు. అత్తిలి డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తూ వందలాది వేదికలపై నాటికలు, మిమిక్రీ షోలు చేసేవారు. సినీ హాస్యనటుడ్సుబహ్మానందం, తనప్రియ శిష్యుడైన వెంకటరమణను కూడా తీసుకెళ్ళి తాను మిమిక్రి చేసేముందు రమణతో ఏకప్రాతలు చేయించేవారు. అలా రామచంద్రాపురం వెళ్ళినపుడు జరిగిన సరదా సంఘటనే ఇది. "రవణా నేను ఇపుడో తమాషా చేస్తా చూడు, నేను తాగినట్టు నటిస్తాను, నువ్వు నన్ను పట్టుకుని ఆపుతున్నట్టు నటించు" అంటూ బస్టాండ్‌లో తాగినట్టు హడావిడి చేశారు.

సినీనటుడు కాకముందు బ్రహ్మానందం, మిత్రుడు పెమ్మరాజు శ్రీనివాస్‌లతో వెంకటరమణ (1978)