పుట:Ammanudi july 2018.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొనసాగించారు. ఆయన శిష్యులు ధర్మారావుగారు పుస్తకాలు, పత్రికలు, సినిమాల ద్వారా మాట్లాడే భాషని విశేషంగా ప్రజల్లోకి తీసుకెళ్ళారు.

'ధర్మారావుగారు ఏనాటివాడో - తొలి నుంచి నలుగురు నడిచే దారిలో కాకుండా కొత్త దారులకోసం వెతికారు. అటు పాశ్చాత్య సాహితీ సంస్కృతులను, ఇటు జాతీయ సారస్వత సభ్యతను చక్కగా జీర్ణించుకొని, అధునిక దృక్పథంతో అపూర్వ రచనా సంవిధానంతో తన తావు తాను చూనుకుని, తన గొంతు తను వినిపిస్తూ, విసిష్ట వ్యక్తిత్వం వెలార్చిన మనిషి ఆయన.

నవ్యాతి నవ్య దృష్టితో నమాలోచించగల ధీశాలి. తెలుగు దిన వత్రికలల్లో తొలిసారిగా వ్యావహారిక భాషని ప్రవేశపెట్టిన సాహసి కూడా ఆయనే: అన్నారు విద్వాన్‌ విశ్చంగారు.

ఆయనకు ఎందరో శిష్యులు. అందరూ అదే తోవ పట్టారు.

గిడుగు వారి తర్వాత వ్యావహారిక భాషకి పెద్ద పీట వేసిన వారు ధర్మారావుగారు. సంపాదకుడిగా పత్రికల్లో వ్యావహారిక భాషకి పెద్దపీట వేయడమే కాకుండా చలనచిత్రాల వైపు ఆయన దృష్టి సారించడం మన అదృష్టం. మొట్టమొదట స్క్రీన్‌ప్లే రాయడం తెలియజెప్పినవారు ఆయనే. మనం బయట రాసే దానికీ సినిమాలకి కావల్సిన శిల్పానికి తేడా ఉందని గుర్తించి చెప్పారు. అలాగే సినిమాల్లో చక్కని వ్యావహారిక భాషనే వాడారు. ఈ కారణాల వల్ల వ్యావహారిక భాషకి ఎంతో మేలు జరిగింది. ధర్మారావుగారు జీవితాంతం వరకు తను నమ్మిన ధర్మాలనే మన అందరికీ అర్ధమయ్యే భాషలో చూపిస్తూ సాగారు. గిడుగువారి చివరి రోజులలో చెన్నైకు తీసుకు వెళ్లినప్పుడు, ఆయన కోరిక మీదట గూడవల్లి రామబ్రహ్మంగారి కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో గిడుగు రామ్మూర్తిగారు చేసిన ప్రసంగం శాశ్వతంగా గుర్తుండిపోతుంది. “యూనివర్సిటీలున్నూ ప్రభుత్వ విద్యాశాఖ వారున్ను మాత్రం ఇంకా అనుగ్రహించలేదు. 25 సంవత్సరముల క్రిందట ఈ రెండు నంస్థలవారున్నూ వాడుక భాషను గ్రహించవలెనని చూసినప్పుడు నా వాదం తెలుగువారు గ్రహించకపోవడం చేత అలజడి ఎక్కువయినది. అందుచేత ఆ నంస్ధలవారు దానిని గ్రహించలేదు. ఇప్పుడు తెలుగువారు నా వాదనను గ్రహించిన వారుగనుక , ఆ సంస్థలవారు గ్రహించి ఆమోదించేటట్లున్నూ. ఆచరణలో పెట్టేటట్లున్నూ చేయవలసిన భారం మీది. ఆ పని మీకప్పగించి నేను విరమిస్తున్నాను - సెలవు” అని తన కట్టకడపటి సందేశంగా ఆయన చెప్పారు.

ఆ సందేశాన్ని అందిపుచ్చుకుని తాపీ ధర్మారావుగారు చేసిన కృషి అనితర సాధ్యమైనది. వేంకటేశ్వర యూనివర్సిటీలో కమిటీ సభ్యుడుగా - వ్యవహారిక భాషను ఆమోదింపజేసే కృషిలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు.

అంతేకాదు 'ఏది రాతో ఏది రోతో వివరిస్తూ 'కొత్తపాళీ'లో ఆయన రాసిన కవిత రచయితలందరికీ మార్గదర్శకంగాఉండిపోయింది. “చదివిన విన్నా జనులందరికీ చక్కగ తెలిసితె రాతా/మెదడు చించుకొని నిఘంటులన్నీ వెదికించిందే రోతా” “వాడుక మాటల వల్లనే భావాల్‌ ప్రకటించిందే రాతా/పాడు ముష్టితో పెద్ద సమాసాల్‌ వాడిందైతే రోతా” “చిన్న మాటలనె గొప్పభావములు చెప్పగలిగితే రాతా / మిన్ను విరిగినట్లు ధ్వనించి భావం సున్న చుట్టితే రోతా” (పూర్తి పాఠం అమ్మనుడి పత్రిక జూన్‌ 2018 -17వ పుటలో చూడండి)

ఆ కవితతో పాటే కొత్తపాళీలోనే ఆయన తన సందేశాన్ని ఈ విధంగా కవితాబద్ధం చేశారు. “గొంతులో ఒక అగ్ని కొత్తగా రగిలింది / తంత్రులన్నీ ఒక్క పుంతలో పడ్డాయి / ఇంతింత అనరాని వింతబల మొచ్చింది / స్వార్ధగానము మానరా / ఓ కవీ సార్ధకానికి వూనరా / ప్రజల కవివై గొంతు రగిలించి పాడితే బక్కడొక్కలు రేగి ప్రణయమారుత మట్లు తక్కువెక్కువలెల్ల ఒక్క దెబ్బను కూల్చి లోకాల నూగించవా ఓ కవీ శోకాల తొలగించవా"

ప్రజాస్వామ్యం, ప్రగతి ఆయన కోరుకున్న మార్గాలు. భాషలో ప్రజాస్వామ్యాన్ని ఆధునిక యుగ లక్షణంగా నమ్మి పత్రికా సినీ మాధ్యమాల్లో దానిని పూర్తిగా అమలు చేసి ప్రజలగొంతుకు బలాన్ని పెంచారాయన. అదే ఆయన జీవన సందేశం. అదే ఆయన మరణ వాఙ్మూలం.


ఇంటిభాష

పాఠశాల భాష కావాలి

పిల్లలు చదువులో రాణించాలంటే విద్యాబోధన పరాయిభాషలో కంటే సొంతభాషలోనే జరగాలి. విద్యార్థికి మాతృభాషలో బోధన జరిగితే సబ్జెక్టు ఎక్కువ అర్ధం అవుతుంది. అమ్మ చేతి స్పర్శలాగా, సొంత ఊరు ఓదార్పులాగా, నివసిస్తున్న ఇంటినీడలాగా, మాతృభాష పిల్లల గుండెను తాకు తుంది. అటువంటి ప్రసార మాధ్యమం ద్వారా సబ్జెక్ట్‌ చెప్పగలిగితే విద్యార్థికి అర్ధం అవుతుంది. ఇందుకు భిన్నంగా మరో భాష ద్వారా విద్యాబోధన జరిగితే కృత్రిమ మార్గాన్ని ఎంచుకున్నట్లే,

విద్యాహక్కు (రైట్‌ టు ఎడ్యుకేషన్‌) కింద విద్యార్థులకు విద్యా సౌకర్యం కల్పిస్తున్నాం కాని, వాస్తవ విజ్ఞానార్జనకు కావలసిన పునాది ఇవ్వలేక పోవడానికి బోధనా భాష అవరోధంగా నిలుస్తోంది. దీన్ని గుర్తించిన అన్ని దేశాలు ప్రాథమిక విద్యాభ్యాసాన్ని మాతృభాషలో చేస్తుంటే మనం ఇంగ్రీష్‌ను ఆశ్రయించాం. అయితే ఇంగ్లీష్‌ నేర్చుకోవడాన్ని విస్మరించమనడం ఇక్కడ ఉద్దేశం కాదు. ఇంగ్రీషును ఒక భాషగా బోధించవచ్చు. ఆ నైపుణ్యాన్ని ఎంతైనా మెరుగు పర్చవచ్చు, కానీ భావనల రూప కల్పన దశలో మాత్రం బోధన ఇంటిభాషలోనే ఉండాలి. ఇటలీ, ఫ్రాన్స్‌ల్లో జరుగుతున్నదదే. ఇంగ్రీష్‌ను కేవలం నాలుగేళ్ళు మాత్రమే బోధిస్తారు. అయితే విద్యార్థి ఆ భాషలోనూ రాణిస్తున్నాడు. మౌలిక భావనల విషయంలోనూ పటిష్టమవుతున్నాడు.

ప్రాథమిక విద్యాభ్యాసం ఇంటిభాషలో జరిగిన తర్వాత ఉన్నత విద్యకు చేరిన దశలో బోధన విద్యార్థి స్వేచ్చకే వదిలేయవచ్చు. విద్యార్థికి జ్ఞానం వచ్చిన దశ కావడంతో అతడికి ఆసక్తి గల భాషను ఎంచుకుంటాడు.

20

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూలై 2018