పుట:Ammanudi April-July 2020.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలన్నింటిలోనూ

మాతృభాషా మాధ్యమాన్ని అమలుచేయాలి

(మాతృభామా మాధ్యమ వేదిక ప్రారంభించిన ఆన్‌లైన్‌ మహజరు)

ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలన్నింటి లోనూ విద్యాహక్కు చట్టం ప్రకారం 8వ తరగతి వరకు మాతృభాషా మాధ్యమాన్నే అమలు చేయాలనే డిమాండు సాధనకై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించిన ఈ ఆన్‌లైన్‌ మహజరుకు మీ ఆమోదం తెలియజేయగలందులకు విజ్ఞప్తి.

ఈ పిటీషన్‌ ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే సంబంధించినది కాదు. ప్రైవేటు పాఠశాలలకు కూడా విద్యాహక్కు చట్టం వర్తిస్తుంది. ప్రైవేటు పాఠశాల్లలోకూడా ఎనిమిదవ తరగతివరకు మాతృభాషా మాధ్యమాన్ని అమలుచేయాలి. మధ్య తరగతి వారు మాతృభాషా మాధ్యమమే తమ బాలల సమగ్రాభివృద్ధికి మంచిదనే విషయాన్ని గ్రహిస్తే వారి బాలలకు, ప్రజల భాషలకూ మరియు విస్తృత సమాజానికి మంచిది. ఒక వైపు ప్రైవేటు విద్య, మరొక వైపు ఆంగ్లమాధ్యమం ద్వారా బాలలు ఎంత ఒత్తిడికి గురవుతున్నారో తల్లితండ్రులు గమనించాలి. తమ స్వంత భాషలో బాలలు ఇష్టంగా, ఉత్సాహంగా, సృజనాత్మకంగా విద్య నేర్చుకొాంటారని ప్రపంచ వ్యాప్తంగా మేధావులు చెబుతున్నారు. అంతేకాదు, మాతృభాష ద్వారానే ఇంగ్లీషుతో సహా ఇతర భాషలు బాగా నేర్చుకోవచ్చని బోధనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విషయాలను గ్రహించి అన్ని వర్గాల ప్రజలు మాతృభాష మాధ్యమానికి మద్దతు తెలపాలి.

ఆంగ్లం అవసరమే. ఆయితే ఆంగ్లభాష ఆంగ్లమాధ్యమం ద్వారా రాదు. ఎల్‌.కే.జీ. నుండి బీ.టెక్‌. వరకూ ఆంగ్ల మాధ్యమంలో చదివినవారు పట్టుమని పది వాక్యాలు కూడా ఆంగ్లంలో రాయలేక ఫోవడమే దీనికి రుజువు. ప్రతి ప్రాథమిక పాఠశాలలోనూ ఆంగ్లంలో ప్రత్యేకార్హతలూ, బోధనలో ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించితేనే పిల్లలకు ఆంగ్లం వస్తుంది. ఇటు ప్రభుత్వ పాఠశాలల్లోగానీ లేదా అటు ప్రైవేటు పాఠశాలల్లోగానీ అటువంటి ఉపాధ్యాయ పోస్టులు లేవు. అందుకే ఎవరికీ ఆంగ్లం రావడంలేదు. ఆంగ్లాన్నీ ఒక పాఠ్యవిషయంగా బోధించాలి. కాగా లెక్కలు, సైన్సు మరియు సోషల్‌ వంటి ఇతర పాఠ్య విషయాలను మాతృభాషా మాధ్యమంలో బోధించాలి. మాతృభాషా మాధ్యమం కారకు మరియు ఆంగ్ల భాష మెరుగైన బోధన కొరకు ఈ ఆన్‌లైన్‌ మహజరుపై సంతకం చేయగలందులకు విజ్ఞప్తి.

-మాతృభాషా మాధ్యమ వేదిక

భాష, విద్యా, విజ్ఞాన వేదికలు: 1) తెలుగు భాషోద్యమ సమాఖ్య, 2) విద్యా వికాస వేదిక, 3) విద్యాపరిరక్షణ కమిటి, 4) తెలుగు భాషాశాస్త్రజ్హుల వేదిక, 5) జన విజ్ఞాన వేదిక, 6) ప్రజాసైన్సు వేదిక. ఉపాధ్యాయ సంఘాలు:1) యు.టి.యఫ్‌ 2) ఎస్‌.టీ.యూ 3) ఎ.పి.టి.యఫ్‌ (257) 4) ఎ.పి.టి.యఫ్‌ (1938) 5) డి.టి.యఫ్‌. విద్యార్థి సంఘాలు:1) ఏ.ఐ.యస్‌.యఫ్‌.. 2) పి.డి.యస్‌.యు., 3) యస్‌.యఫ్‌.ఐ., 4)పి.డి.యస్‌.యు. సాహిత్య సాంస్కృతిక సంస్థలు: 1) అభ్యుదయ రచయితల సంఘం 2.) సాహితీ స్రవంతి ౩.) జనసాహితి 4)విష్లవ రచయితల సంఘం 5.) జాషువా సాంస్కృతిక వేదిక 6.)ప్రజానాట్య మండలి .

ఈ క్రింది రెండింటిలో ఏదో ఒక పద్ధతిలో మీ అన్‌లైన్‌ పిటీషన్‌ను ముఖ్యమంత్రి గారికి పంపించవచ్చును

http://chng.it/ykkQq9bXDS ఈ లింకును తెరచి, అందులో సూచించిన ప్రకారం అన్‌లైన్‌ పిటీషన్‌ను పంపండి

2వ పుట (అట్టలోపలి పుట) చూడండి

ఈ QR కోడ్‌ను స్మాన్‌ చేసి అందులో సూచించిన ప్రకారం అన్‌లైన్‌ పిటీషన్‌ను పంపండి


పాఠక మిత్రులకు విజ్ఞప్తి

ఈ ఆన్‌లైన్‌ మహజరును ఎవరైనా పంపవచ్చును. 'అమ్మనుడి పాఠకులు అందరూ పంపించాలని కోరుతున్నాము. మీ మిత్రులను కూడా ప్రోత్సహించి, వారి నుంచి కూడా పంపించుటకు చొరవ తీసుకోవలసిందిగా విజపి చేస్తున్నాము.

-సంపాదకుడు

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జులై-2020

6