చూపించింది.
జేమ్స్ ఫెర్దుసన్ “హిస్టరీ ఆఫ్ ఇండియన్ అండ్ ఈస్టర్న్ ఆర్కిటెక్చర్ అని ఆ పుస్తకం అట్టమీద ఉంది.
మరో పుస్తకం చూపిస్తూ.. 'తెలుగు చరిత్రకారులు మారేమండ రామారావుగారు తన 'ఆంధ్రాస్ త్రూ ఏజెస్లో గ్రేటర్ ఆంధ్రా ఛాఫ్టర్లో ఈ విషయాన్ని బలపరచారు. అంతేకాదు బొరబొదూర్లోని శిల్భఫలకాలు అమరావతి స్థూపంలోని శిల్పఫలకాల మాదిరిగానే ఉన్నాయని పేర్కొన్నారు. ఆనాడు జావాలో పూర్ణవర్మ అనే రాజు గోసహస్ర దానం చేశాడని ఇక్ష్వాకులు, పల్లవులు, విష్ణుకుండినులు కూడా ఇలాంటి దానం చేయడం ఇక్కడ గుర్తుచేసుకోవాలని రామారావుగారు స్పష్టపరచారు..” అంటూ చరిత్రంతా ఔపోశన పట్టినదానిలా చెబుతోంది.
నేను ఆశ్యర్యపోతూ వింటున్నాను.
“ఆ పూర్ణవర్మ గురించి మరింత వివరంగా నీకు చెప్పాలి. జావాలో చారిత్రక ఆనవాళ్లని చాలా భద్రంగా దాచుకుంటారు. ఇక్కడికి వచ్చే ముందు నేను రాజధాని జకార్హాలోని నేషనల్ మ్యూజియం వెళ్లాను. అక్కడ పూర్ణవర్మ పాదగుర్తులున్న ఓ పెద్ద బండరాతిని ఏసీ గదిలో భద్రపరచారు. పక్మనే ఆయన శాసనాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ పూర్ణవర్మ రాజు గురించి, ఆయన పాదముద్రలు గురించి 1923లోనే విఖ్యాత చరిత్రకారులు భావరాజు వేంకట కృష్ణారావుగారు తన “ప్రాచీనాంధ్ర నౌకాజీవనము” లో పేర్కొన్నారు. కృష్ణారావుగారు ఈ విషయాన్ని వందేళ్ల క్రితమే. రాశారు... కానీ మనకెక్కడా తెలియదు.” కాస్త ఆగింది.
అవును నిజమే. ఇండోనేషియా అంటే జకార్తా, బాలి మాత్రమే తెలుసు కానీ జోగ్యకర్త గురించి అసలు వినలేదు. ఇక బొరబొదూర్ గురించి ఏమని చెప్పను. ప్రాబీన కాలంలో ఇండోనేషియా, తెలుగు నేలకు ఉన్న సంబంధానికి గొప్ప గుర్తు బొరాబుదూర్. అంతటి చారిత్రక వారధి గురించి ఏ పాఠ్యపుస్తకంలో లేదు. హైదరాబాద్, విజయవాడల్లో ఏ మ్యూజియంలో పేర్కొనలేదు. కనీసం రోడ్డుపై కటౌట్ కూడా పెట్టలేదని ఆవేదన వెల్లబుచ్చా.
“నీకే ఇలాగ ఉంటే తెలుగు తల్లి గుండె ఎంత బరువెక్కిపోయి ఉంటుంది. క్రీస్తుపూర్వం తొలినాళ్లలో తన బిడ్డలు సాహసోపేతంగా సముద్రదారులని జయించి విదేశీ గడ్డలపై జయకేతనం ఎగరేసిన సంగతిని జాతంతా మరచిపోయారని బోసి పోయి ఉంటుంది. హిందూ మహాసముద్రంలో మన తాతముత్తాతలు చేసిన సాహసాలు, విదేశీ గడ్డపై వారు స్థాపించిన వలస రాజ్యాలు... ఆ ఫునచరిత్ర వృధా కారాదు. వివిధ కాలాల్లో, వివిధ రాజ్యాల్లో పర్యటిస్తూ వాటన్నిటినీ నువ్వు ప్రత్యక్షంగా చూస్తున్నావు. వాటన్నిటిపై ఓ పుస్తకం రాయి. ఓ భగవద్లీతలా, ఖురాన్ లా ప్రతి తెలుగు ఇంట్లో ఆ పుస్తకం ఉండాలి.
ఆవేశంతో, అఖినివేశంతో తొలితెలుగువాడు సాధించిన ఘన కార్యాలను చదివి ప్రతి ఒక్కరిలో ఆవేశం ఉప్పాంగాలి. ఈ పని తవ్పకుండా చేస్తానని మాటివ్వు నూర్యా అంటూ చేయిచాచింది...”
మరో ఆలోచన లేకుండా వెంటనే ఆమె చేతిలో చేయి వేశాను...
“థాంక్స్ అంటూ..” ఇంకో చేయి వేసి రెండు చేతులతో నా చేతిని పట్టుకుని సంతోషంగా చూసింది.
ఇంతలో తనకి దగ్గు వచ్చింది. దగ్గుతూ ఓ చోట కూర్చుంది. గాల్లో వాసన తేడాగా అనిపించింది. చుట్టు పక్కల చూస్తే చాలా మంది అలాంటి పరిస్థితిలోనే ఉన్నారు. ఏదో అనౌన్నెంట్ ... ఇండోనేషియా భాషలో ... మాకు అర్ధం కాలేదు. స్థూపం పైనున్న జనం చాలా హడావుడిగా కిందకి దిగుతున్నారు. ఇంగ్లిష్లో అనౌస్మెంట్ వస్తోంది. దగ్గరలో అగ్నిపర్వతం బద్దలైందట. ఆ పొగ, ధూళి కాసేపట్లో ఈ ప్రదేశాన్నంతా చుట్టుముట్టేస్తుంది. సాధ్యమయినంత తొందరగా ఈ ప్రదేశాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి రమ్మని హెచ్చరిక. క్షణాల్లోనే అక్కడ వందల సంఖ్యలో జనం ఫోగయ్యారు. రెస్క్యూ బృందం జనాల్ని తరలిస్తున్నారు. కాసేపట్లో వాతావరణం మొత్తం మారిపోయింది. పొగ ఎక్కువైంది. బూడిద వర్షంలా పడుతోంది. ఓవైపు హోరు గాలి. వెన్నెల కూర్చున్న వైపు చూశాను. తను లేదు.
“వెన్నెలా... వెన్నెలా... ” గట్టిగా పిలుస్తూ వెతుకుతున్నాను. నా అరుపులు వినైనా నా దగ్గరకి వస్తుందని ఆశ. కానీ నిరాశే...అంత మందిలో వెతకడం కష్టం. గాల్లో ఆక్సిజన్ పాళ్లు తగ్గినట్టున్నాయి. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. సహాయక బృందం అందరినీ తరలిస్తోంది. వెన్నెల సురక్షిత ప్రాంతానికి వెళ్లి ఉండాలన్న ఆశ. వర్షంలా దట్టమైన బూడిద వచ్చి నా పైన పడింది. ఒక్కసారిగా కింద పడిపోయాను. స్పృహకోల్పోయా...
“చదువులోని ప్రాధమిక దశలోనే శాస్త్ర విజ్ఞానంలోని ప్రాథమిక భావన బీజాలుంటాయి. విద్యార్థికి పాఠశాల గది బయట మాతృభాషలో కలిగే శాస్త్ర విజ్ఞాన అనుభవాలకు, పాఠశాల గదిలో పరాయిభాషలో చెప్పే విజ్జాన భావనలకు పొంతన అందక, సమన్వయం కుదరక, అతని అవగాహన విస్తృతం కాదు. శాస్త్రం మీదే కాక, చదువు మీద కూడా ఆసక్తి తగ్గుతుంది” - డి. ఎస్. కొఠారి.