Jump to content

పుట:Ammanudi April-July 2020.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయిపోయాయి. తరవాత ఏమిటి అన్నట్టుగా తనని చూశా.

“నీకో అద్భుతం చూపిస్తా రా కిందకి వెళదాం” అంది.

ఒక్కో మెట్టు దిగుతూ కిందకి వస్తున్నాం. చీకట్లో తెలియలేదు. కానీ మెట్లు ఎత్తుగా ఉన్నాయి. అటూ ఇటూ స్టీల్‌ రైలింగ్‌ ఉంది ఆసరాకోసం. ఇది నాలుగో అంతస్తు అంటూ కుడివైపుకు తీసుకెళ్లింది. అక్కడ గోడపై ఉన్న ఓ శిల్పఫలకం దగ్గర ఆగింది. ఓ శిల్పాన్ని చూపిస్తూ...

“ఇతడెవరో చెప్పుకో చూద్దాం” అంటూ ప్రశ్నించింది.

కాసేపు ఆ శిల్పాన్ని చూస్తూ 'రాకుమారుడా... ”

కాదని తలూపుతూ పక్షనే ఉన్న మరో శిల్పఫలకం దగ్గరకి తీసుకువెళ్లింది. అలాంటి శిల్పాన్నే చూపిస్తూ '“ఇతడెవరో చెప్పగలవా” అంది.

పరికించి చూస్తే మొదటి శిల్పఫలకంలో ఉన్న యువకుడి లాగానే ఈ శిల్పం కూడా ఉంది. సుమారు ఎనిమిది అడుగుల పొడవు, ఆరు అడుగుల వెడల్పుతో ఈ శిల్చ ఫలకాలు ఉన్నాయి. ప్రతి దాంట్లో కొంత మంది మనుష్యులు ఉన్నారు. రాళ్లపై ఏవో కథలను చెక్కినట్టుగా ఉంది. కానీ అదేమిటో నాకు తెలియడం లేదు. కనీసం అక్మడ అదేమిటన్న వివరణా లేదు.

ప్రశ్నార్ధకంగా వెన్నెలని చూశాను. తను ఆ యువకుడి శిల్చంతో సెల్ఫీలు దిగుతూ ముందుకు వెళుతోంది.. తనని అనుసరిస్తూ కిందకి చూశాను... అంతస్థులు అంతస్థులుగా చతుర(స్రాకారంలో నిర్మాణం ఉంది. దిగువన చాలా మంది టూరిస్టులే ఉన్నారు. అలా చుడుతూ వస్తుంటే ఉత్తర ద్వారం వచ్చింది. ఈ స్టూపానికి నాలుగు వైపులా మెట్ల దారులు ఉన్నాయి. మెట్లు దాటుకుని వచ్చాం.. ఇక్కడ కూడా అలాంటి యువకుడి శిల్పఫలకాలే ఉన్నాయి.

“అవన్నీ ఏమిటి వెన్నెల..” అడిగాను.

నా అసహనాన్ని గుర్తించినట్టుంది..

“.ఈ యువకుడి పేరు సుధన కుమారుడు. ధాన్యకటకం అంటే నేటి అమరావతి నగరానికి చెందిన వ్యాపారి కొడుకు. బోధిసత్వుడిగా మారేందుకు మార్గం అన్వేషిస్తూ యాఖై మంది గురువులని కలుసుకుంటాడు. ఇతడి కథనంతా వివరిస్తుంది “గండవ్యూహ” అనే మహోయాన బౌద్ద గ్రంథం. ఈ కథ ధాన్యకటకంలో పుట్టి అక్కడే ముగుస్తుంది. ఈ గండవ్యూహ కథను ఇక్కడ కాక మరో చోట కుడ్య చిత్రాల మాదిరిగా చిత్రించారట. అది చైనాలోనో టిబెట్టులోనో ఉందట. అంత కరెక్టుగా తెలియదు.”

'సుథనుడి శిల్పాన్ని జాగ్రత్తగా చూడు... అతడి కిరీటం లాంటి తలపాగ, పంచెకట్టు... రాజసం ఉట్టిపడుతున్నట్టుగా ఉన్నాడు కదూ. ఇతడిని బట్టి కరెక్టుగా రెండు వేల ఏళ్ల నాడు మన తెలుగు నేలపై యువకులు ఎలా ఉండేవారో ఊహించవచ్చు. ఇన్ని వేల కిలోమీటర్ల దూరంలో మన తెలుగు యువకుడి కథ గురించి ఇలా శిల్పాలుగా చెక్కడం నీకు ఆశ్చర్యంగా లేదా? రెండు వేల ఏళ్లు వెనక్కి వెళ్లి మన ధాన్యకటకం వ్యాపారి కొడుకును కలుసుకుంటున్నానన్న ఆనందం లేదా? తన ప్రశ్నలు సూటిగా ముల్లుల్లా గుచ్చుకుంటున్నాయి.

“మహాద్భుతం... దీని గురించి మన వాళ్లకి తెలుసా ”

“అరవై ఏళ్ల క్రితం వరకూ పుస్తకాల్లో రాశారు, కానీ ఆ తరవాతే మరచిపోయారు తను నిట్టూర్చింది.

“ఇదంతా మన తెలుగు పుస్తకాల్లో ఎందుకు రాయలేదు. సుధనుడి బొమ్మ ఏ మ్యూజియంలోనూ ఎందుకు పెట్టలేదు. సుధన అనే పేరే నేనిప్పటి వరకూ వినలేదు...” ఆశ్చర్యంగా అడిగా.

తను గట్టిగా నవ్వింది... మన తెలుగు వాళ్లకి చరిత్రపై అంత మమకారం ఎక్కడుంది? నువ్వే చెప్పు నువ్వు ఓ నెల్లో ఎన్ని సార్లు హిస్టారికల్‌ మాన్యుమెంట్స్‌ చూడడానికి వెళతావ్‌? ఎన్ని సార్లు లైబ్రరీకి, మ్యూజియానికి వెళతావ్‌, అసలు నువ్వు పుస్తకాలు చదువుతావా? ఒక్క ప్రశ్నకూ నీ దగ్గర సమాధానం లేదని నాకు తెలుసు.. పదా కిందకి వెళదాం.. నీకు ఇంకో అద్భుత విషయం చూపిస్తాను... అంది.

“నీ దగ్గర అన్నీ అద్భుతాలేనే' అని పొగిదా.

“నా దగ్గర కాదు, బొరబుదూర్లో మన తెలుగు జాతికి సంబంధించి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి”

మూడు, రెండో అంతస్తుల్లో కూడా సుధన కుమారుడి కథే ఉందని చూపించింది. మొదటి అంతస్థులో బుద్దుడి కథలున్నాయి...వాటిని చూస్తూ కిందకి వచ్చేశాం. ఎంతో విశాలమైన ప్రదేశాన్ని చుట్టూ వదిలి పెట్టారు. చాలా మంది అక్కడి గడ్డి మీద కూర్చుని సేదతీరుతున్నారు. మేం కూడా స్థూపానికి ముప్పై అడుగుల దూరంగా వచ్చేశాం. ఒక్కసారి వెనక్కి తిరిగింది. పెద్ద స్ఫూపాన్ని తేరపార చూస్తోంది. వందల సంఖ్యలో బుద్ధ విగ్రహాలు కిందకి కూడా కన్పిస్తున్నాయి. పై మూడు అంతస్టుల్లో విగ్రహాలను పూర్తిగా ఎన్‌ క్లోజ్‌ చేసి ఉంటే దిగువనేమో గుహలో కూర్చున్నట్టుగా నిర్మించారు. అదే మాట తనతో అన్నాను.

తేడా భలే కనిపెట్టావే' అని మెచ్చుకుంది.

“ఓసారి నా బ్యాగ్‌ ఇవ్వు అంటూ లాక్కుంది. అందులోంచి ఏవో పుస్తకాలు తీసింది. వాటిలోంచి కొన్ని ఫొటోలను తీసింది. ఈ ఫొటో చూడండి.

“ఈ కొండ లాగానే ఈ స్థూపం ఉంది కదా. బుద్దుడి విగ్రహాలను కూడా ఈ ఫొటోలో ఉన్న మాదిరిగానే ఈ కొండను తొలిచారు కదా”. అంది.

“అవును... రెండూ ఒకేలా ఉన్నాయి... కాకపోతే ఈ ఫొటోలో రెండస్టులే ఉంది.. కానీ ఇక్కడ చాలా పెద్ద స్థాయిలో ఉంది. ఇంతకీ ఈ ఫొటోలో ఉంది ఏ ప్రదేశం? ఎక్కడుంది? విస్మయంతో అడిగాను.

ఇది అనకాపల్లి సమీపంలోని బొజ్జన్నకాండ. బొరాబుదూర్‌ స్థూపానికి ప్రేరణ బొజ్జన్నకొండ. ఈ విషయం నేను చెప్పడం లేదు. డచ్‌ ఆర్కిటెక్ట్‌ జేమ్స్‌ ఫెర్దుసన్‌ 1887లోనే ఈ విషయం రాశారు. ఇదిగో ఈ వుస్తకంలో బొరొబుదూర్‌ స్థూపాకృతికి ప్రేరణ సంఘారామం అని ఆయన పేర్మొన్నారంటూ ఓ పాత పుస్తకాన్ని

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి జూలై-2020

33