కాసేపటికి... నా కళ్లలోకి సూటిగా చూస్తూ 'సారీ, నన్ను వేరేలా అర్థం చేసుకోవద్దు. దాదాపు పదేళ్ల నుంచి ఈ ప్రదేశానికి రావాలనీ కలలు కంటున్నా. ఇప్పటికి ఈ కల నెరవేరింది. ఆ సంతోషాన్ని నీతో షేర్ చేసుకున్నా వేల ఏళ్ళుగా మరుగున పడి పోయిన తెలుగు వారి చరిత్రనంతా నువ్వు వెలికి తీస్తున్నావ్. నా దృష్టిలో నువ్వు 'సూపర్ హీరో”. నీపై ఎంతో అభిమానం ఏర్పడింది అందుకే చొరవ తీసుకున్నా...” సంజాయిషీ ఇస్తున్నట్టుగా మాట్లాడింది.
“ఇట్స్ ఓకే... అర్ధం చేసుకోగలను” నచ్చవచెప్పా.
“థాంక్యూ”. అంది.
నీ పేశేమిటి? నువ్వు ఇండోనేషియా దాకా కేవలం ఈ జొరబొదూర్ స్తూపాన్ని చూడడానికే వచ్చావా? అడిగా.
“నా పేరు వెన్నల. తెలుగుపై మమకారంతో నాన్న ఎంతో ఇష్టంగా పెట్టిన పేరు. బెంగాల్లో సుప్రసిద్ద చరిత్రకారులు హెచ్చీ సర్కార్, ఖరగ్ పూర్లో ఆయన ఇల్లున్న రబీంద్రపల్లి వీధిలోనే మేం ఉంటున్నాం. నేను పుట్టే సమయానికి ఆయన పోయారు. కానీ నాన్న ఆయన గొప్పతనం గురించి ఆ ఇంటి మీదుగా వెళ్తున్న ప్రతిసారీ చెప్పేవారు. అలా నాకు హెచ్చీ సర్మార్ అంటే ఎంతో అభిమానం ఏర్పడింది. దాంతో హిన్టరీ నా ఫేవరెట్ నబ్జెళ్ళ్సు అయింది. ఇండోనేషియా చరిత్రపై ఆయన చేసిన పరిశోధనలపై పీహెచ్దీ చేస్తూ ఇలా ఇంత దూరం వచ్చా.
నేడు ఇండోనేషియాకు మన తెలుగు నేలకు చాలా దూరం ఉన్నట్టుగా అన్పీస్తుంది కానీ ఒకప్పుడు మన తాతముత్తాతలు తెరచాప పడవల్లో సునాయాసంగా ఇంత దూరం వచ్చి ఈ జువా, సుమత్రా ద్వీపాలల్లో వాణిజ్యం చేసేవారు. ఒక్క వ్యాపారులేమిటి? పురోహితులు, రాజకుటింబికులు, బౌడ్ధాచార్యులు, ఇతర వృత్తుల వారు అనేకులు మన నేలల నుంచి ఎందరో ఇక్కడికి వచ్చారు. ఆ ఆనవాళ్ళు ఎన్నో ఉన్నాయి ఇప్పటికి. మీనాల్లాంటి కళ్లను అటూ ఇటూ తిప్పుతూ ఎంతో హుషారుగా చెబుతోంది.
ఏమాటకు ఆ మాటే చెప్పాలి... వెన్నెల ఎంతందంగా ఉందో తన మాటలూ అంతే అందంగా ఉన్నాయి. ఇండోనేషియా పేరును నా జన్మలో ఒకటో రెండుసాల్లే మాత్రమే విన్నాను. ఈ అమ్మాయేమో ఇందోనేషియాకి తెలుగు జాతికీ ఉన్న సంబంధం గురించి తెలియ జేస్తోంది. లోపల్లోపల సిగ్గుతో చచ్చిపోతున్నాను. హిస్టరీ పాఠాల్లో ఇకనుంచైనా స్థానిక రాజులు, వారి నిర్మాణాలు, దేశవిదేశాల్లో వాళ్ల ఘనకీర్తి చరిత్రలు ఉండేలా రాస్తే బాగుంటుంది. ఎంత సేపూ దిల్లీ సుల్తానులు, మొధులులు ఇంతేనా... నా ఆలోచనలకు కాస్త
| తెలుగుజాతి పథ్రిక జువ్మునుడి ఆ ఇజలై-2020 |
విరామిస్తూ...
“ఈ బొరబుదూర్ ను ఎవరు.. ఎప్పుడు నిర్మించారు” అడిగా
“ఈ స్తూపాన్ని శైలేంద్ర రాజులు నీర్మించారు. హెచ్. బి.సర్మార్ రచించిన 'ది కింగ్స్ ఆఫ్ జీతైలం అంద్ ద ఫౌందేషన్ ఆఫ్ ది శైలేంద్ర డైనాసిటీ ఆఫ్ ఇండోనేషియా” వ్యాసంలో శైలేంద్రులు ఎక్కడి వాళ్లు అన్న దానిపై సమగ్రమైన వివరణ ఉంది. ఇందులో ఆయన జైలేంద్ర దైనాసిటీకి సంబంధించి అఖించిన తాలి శాసనం లిగర్ అనీ పేర్మొన్నారు. దక్షిణ భారత దేశానీకి చెందిన పల్లవ లిపిలో ఉన్న ఈ శాసనం మలయా ద్వీపంలో దొరికింది. జావాలో లభించిన ఆనాటి శాసనాలు 'సిద్దం” లేదా 'స్వస్తితో మొదలవుతున్నాయి. కృష్టా డెల్టాలో అఖించిన ఇక్ష్వాకులు, పల్లవుల శాసనాలు కూదా ఇలాగే మొదలవడం విశేషం. వీటిలో శక సంవత్సరాలనే వాదారు. ఇక్ష్వా కులకు శ్రీపర్వతీయులుగా పేరు. మేనరికపు పెళ్లిళ్లు చేసుకునే ఆచారం ఉండేది. శైలేంద్రులు కూడా ఇదే ఆచారాన్నీ పాటించారు. ఇక్ష్వాకుల రాజధాని విజయపురి. నేటి నాగార్జునకొండ సమీపంలో ఉండేది. ఆనాడు విజయపురి దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధిచెందిన బౌద్ద కేంద్రం. దేశవిదేశాల నుంచి అనేక మంది అక్కడికి వచ్చిపో తుందేవారు. ఇక్ష్వాకుల తదనంతరం రాజ్య పరిపాలకులు తమ పేర్లకు మొదట రాజధాని పేరును కలుపుకునే క్రమాన్ని పాటించేవారు. గుంటూరు జిల్లాలో దొరికిన కొన్ని శాసనాలు శ్రీవిజయ స్మందవర్శ, శీవిజయ శాతకర్ణి, శ్రీవిజయబుద్దవర్మ అనే పేర్లతో లభించాయి. మలయా ప్రాంతంలో లభించిన లిగర్ శాసనంలో (శశీవిజయేంవ్రరాజ అనే ఉంది. విష్ణుకుండినుల మూల దేవత శ్రీపర్వత స్వామి. ఇక్ష్వాకుల అనంతరం, విష్ణుకుండినుల (ప్రారంభానికి ముందు సుమారు 150 యేళ్ల పాటు ఆ ప్రాంతం అంతా రాజకీయ అనిశ్చితిలో ఉంది. ఆ సమయంలో అక్కడి నుంచి కొంతమంది రాజవంశీయులు జావా, సుమత్రా దీవులకు వెళ్లి వలస రాజ్యాలను స్థాపించి ఉంటారని హెచ్చీ సర్మార్ తేల్చిచెప్పారు.
తెలుగు నేలతో ఈ దేశానికి ఉన్న అనుబంధం గురించి ఇలా స్పష్టంగా తెలుసుకున్న తరవాత ఇందోనేషియాపై ప్రత్యేక అభిమానం ఏర్పడింది. మరిన్నీ గ్రంథాలు చదవడం మొదలుపెట్టాను. తెలుగుజాతికి ఈ బొరొబుదూర్తో ఎంత సంబంధం ఉందో అర్ధం అయింది. వాటన్నిటినీ కళ్లతీరా చూడాలని ఇంత దూరం వచ్చా...” కాస్త ఆగింది.
తల ఎత్తి స్తూప పై భాగాన్నీ చూసింది తన ముఖం ఆనందంతో వెలిగిపోతోంది. ఓ ప్రాచీన నిర్మాణాన్ని చూసి ఇంతలా సంబరపడే వాళ్లని నేనిప్పటి వరకూ చూడలేదు.
మూడుసార్లు చుట్టూ ప్రదక్షిణ చేద్దాం రా అంది. నా చేయి పట్టుకునీ కిందకి దిగింది. స్థూపం చుట్టూ మెల్లిగా నడుస్తున్నాం. దూరంగా పర్వతాలు. మేఘాలు వాటితో దోబూచులాడుకున్నట్టుగా ఉన్నాయి. పచ్చనీ చెట్లు... ఆ ప్రదేశం ఎంతో అందంగా ఉంది. టూరిస్టుల్లో ఇండోనేషియన్లు కూడా ఉన్నారు. వాళ్లలో కొందరు వెన్నెల దగ్గరికి వచ్చి “ఇండియానా...” అని అడిగి 'ఫొటో ప్లీజొ అంటూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. తనూ వాళ్ల ఫొటోలు తీసుకుంటోంది. నేనూ తనతో ఓ సెల్పీ తీనుళకుందామని అనుకున్నా. కానీ ఏవునుకుంటుందోనని ఆగిపోయాను. వూటు చుట్లూ