చేవట్టారు. కాని అడవిలో వెన్నెలలో వర్ణించినట్లు చట్టాలను అమలుచేసేందుకు తయారుచేసే పటాలు, వాటిలో సర్వే నెంబర్లు భూమి అడవి సరిహద్దులు, రికార్డులో వివరాలు, కూలి లెక్కలు తెలియక ప్రజలు మోసపోయేవారు. ఈ ఉద్యమాలలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న మేధావులకు అధికారులు శంకరన్, యుగంధర్ వగైరాలతో సన్నిహిత సంబంధాలున్నా వారు చేపట్టిన భూముల సర్వీ, అటవీ హక్కుల గుర్తింపులలో లెక్కలను, ఆహార భద్రత ఉత్తర్వులను దక్కించుకోవలసిన లెక్కలను, పద్ధతులను నేర్పలేదు సరిగదా, తమ ఎదుటే జరుగుతున్న అక్రమాలను చూన్తూ ఊరుకున్నారు.
వరంగల్లో పరిపాలనా శాస్త్రంలో మరో విద్యార్థి జనార్దనరావు ఇంద్రవెల్లి మారణకాండను ఎదిరించారు. గిరిజన ప్రాంతంలో భూముల అన్యాక్రాంతం మీద సిద్ధాంతగ్రంధం రాసారు. దాంట్లో జిల్లాలో మంగంపేట మొదలైన 23 గ్రామాలను గిరిజనేతరులు కోర్టుకుపోయి తప్పించిన క్రమాన్ని వివరించారు.
1/70 నుండి చిన్నరైతులను మినహాయిస్తూ తెచ్చిన జీ.వో ను, అధికారుల కోరికమేరకు కన్నబిరాన్ కోర్మలో కొట్టేయించిన వృత్తాంతం ఉదహరించారు. అదే విధంగా కోర్టు తొలగించిన 23 గ్రామాల కేసులో అప్పీల్ ఎందుకు వేయలేదో, వేయించలేదో అర్ధం కాదు. పౌరహక్కుల ఉద్యమంలోని మరోవర్గంలో దూరిన న్యాయవాది ప్రతాపరెడ్డి, కొన్ని గ్రామాలకు 1/70 వర్తించదని గిరిజనేతరుల తరపున వరసగా స్టేల మీద స్టేలు తీసుకురావటం
వరంగల్ జిల్లాలొనే మొదలైంది. దీన్నివారు పట్టించుకోలేదు. 'కాలికి బలపం కట్టుకుని తిరగటం, పుంఖానుపుంఖాలుగా రాయటం, ప్రకటనలను గుప్పించటంతో పేరు సంపాదించుకున్నారు. ఉద్యమించే జనంలో ఉత్సాహం పెంచారు. కాని పరిపాలనా పద్ధతులు, వాటి అమలు పట్ల అవగాహన పెంచలేదు. దారి చూపించలేదు. కొ.కు అన్నట్లు 'ఆ పని పూర్తిగా అతిధులకు, అభ్యుదయ దృక్పధం గల రాజకీయ వర్గాలకు వదిలేని- సమాజాన్ని ప్రభుత్వాన్ని విమర్శించటానికి ఎక్కువగా పాటుపడ్డారు ' (కొ.కు. శతజయంతి ప్రత్యేక సంచిక ప్రజాసాహితి పుట 88)
సమస్యలు - సిద్ధాంతాలు - దృక్పధాలు
చిత్తూరు. జిల్లాలో భూముల పంపకంలో ప్రముఖ పాత్ర వహించిన నరేంద్రనాథ్కు బాలగోపాల్ నివాళి అర్పించారు కాని, పెనుగొండలో మొదలైన ఆ ఉద్యమం, రంగారెడ్డి జిల్లా ఇబ్రహిం పట్నంలో. 'సలహ” సంస్థ, ప్రొఫెనర్ హక్ నరసింహారెడ్డి, బొజ్ఞా తారకం, మనోహర్, శైలజ వగైరాలను కలువుకుని అనేక జిల్లాలలో ప్రారంభించిన కృషిని నరేంద్రనాథ్ చిత్తూరు జిల్లాలో కొనసాగించారు. శంకర గుహనియోగి కృషి 'వ్యవస్థతో మొదలై వ్యవస్థతో ముగిసేదిగా పేర్మొన్నారు. (హక్కుల ఉద్యమం, తాత్విక దృక్పధం. కే.బాలగోపాల్: నివాళి వ్యాసాలు. మరపురాని లోకసంచారిలో నల్లమలచెంచుల పట్ల బాలగోపాల్ తపన). ఇవేవో యాదృచ్చికంగా చేసిన వ్యక్తిగత ప్రయత్నాలు కావు. ఏటికెదురీదిన ఆశాకిరణాలివి. నల్లమలను పోలీసు బలగాలు జల్లెడ పడుతున్న రోజులలోనే, ప్రకాశం జిల్లాలో చెంచులు పంచాయత్ రాజ్ ఎన్నికలలో మొదటిసారిగా వోటర్లుగా నమోదై సర్బంచులుగా.ఎన్నికైనారు. గిరిజనేతరుల నుండి మహబూబ్ నగర్ జిల్లాలో రుషులచెరువు, ఎర్రపెంట, రంగాపురం చెరువులు. చేపలు పట్టుకునేందుకు స్వాధీనం చేసుకున్నారు. ఆనాడు మొదలైన అప్పాపూర్ను పంచాయతిని చేసే ప్రయత్నాలు ఫలించాయి. చెంచుల అటవీ హక్కులు నమోదు ప్రారంభమైంది. చెంచులు తమ అటవీ జ్ఞానాన్ని ఆధునిక శాస్త్రాలకు ప్రత్యామ్నాయంగా నిరూపించసాగారు. ఇవేవో చెదురుమదురు సంఘటనలు కావు. తూర్పు కనుమలలో అరకు నుండి అప్పాపూర్ దాకా విస్తరించిన ఈ కృషికి నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్నది.
జాతీయోద్యమ మూలాలు
ఇటువంటి ప్రయత్నాలకు మూలాలు కన్నబిరాన్ మాటల్లో జాతీయోద్యమంలోనే ఉన్నాయి. “మన జాతీయోద్యమ నాయకులు బ్రిటిష్ సంప్రదాయం నుంచే ఉదారవాదం నేర్చుకున్నారు. ఆ ఉదారవాదాన్ని మన జాతీయోద్యమంలో చాలా తిరుగుబాటు స్వభావంతో వాడారు.” 'కమ్యూనిస్ట్ ఉద్యమం మొత్తంగానే ఉదారవాద భావాలను తిరస్కరించటం వెబదలు పెట్టింది. అది దురదృష్టకరంగా (24గంటలు)
భూమి, భుక్తి, పీడితజన విముక్తి కోసం
ఈ నేవధ్యంలో నాటి ఇంద్రవెల్లి మారణకాండ నాటి నుండి (1981), అటు సంప్రదాయ గిరిజన సాహిత్యం సేకరణతో ప్రారంభమైన కృషి, గిరిజనప్రాంతంలో అడవి, భూమి, నీటి హక్కుల కోసం, వాటికి సంబంధించిన చదువు ప్రచారం, తూర్పు కనుమలలో_ అరకులోయనుండి నల్లమల