పుట:Ammanudi-May-2019.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అభిమానులు ఎలా భరించగలరు?

నిజానికి ఈరమ్మవ్వకు ముందరి తరాల వరకూ జానపద కళ సజీవంగా ఉండాలనే కోరిక తీవ్రంగా ఉంది.

నిజానికి ఈరమ్మకు ఈ పురస్కారాల మీద, అవార్డుల మీద కోరిక లేదు.

గ్రామీణుల పిల్లలకు ఈ కథలు నేర్పించే ఒక పాఠశాల ఉంటే బాగుంటుందని అమె ఆలోచన.

ఆ ఆలోచన ఆమె జీవితానుభవంలోంచి మొలకెత్తింది.

ప్రభుత్వం తనకు ఇస్తున్న పింఛన్‌ సొమ్మును గ్రామీణ పిల్లల కోసమే ఉపయోగించాలని నిర్ణయించుకుంది.

అమాయకమైన పిల్లలలో తన గానసౌందర్వాన్ని చూడటానికి ఈరమ్మవ్వ తపించేది.

“ఈ ముసలితనంలో ఇదంతా నీకు ఎందుకమ్మా?” అంటే-

వెంటనే ఆమె నోటి నుంచి వచ్చే మాట-ోఅవ్వా, నీవు పాడుతున్న పాట నీతోటే వెళ్ళిపోకూడదు. అది రాబోయే తరాల వారినీ పెంచాలి. వాళ్ళు నీ కథ నేర్చుకోవాలి అని పెద్దపెద్ద సమావేశాలలో అందరూ చెప్పేవారే. అందుకే రోజూ నేను సాయంత్రం పిల్లలను కూర్చోబెట్టుకుని ఈ బుర్రకథలను ఎలా పాడాలో నేర్పిస్తున్నాను. ఈ తంబూర, డుముకి, గగ్గరి వాయించటం చూస్తే పిల్లలు, యువకులు సంతోషంతో పొంగిపోతారు. వారి సంతోషం చూస్తే నాకు సంతోషం. అదే ఉత్సాహంతో పాఠం చెబుతూ ఆనందం పొందుతున్నాను. నేను పాడుకున్నట్టు పాటలు పాడేవారిని చూడాలనే కోరిక నాకుంది. అదీ నేను బతికి ఉండగానే ఇదంతా చూడాలి” అని ముత్యాలు కూర్చినట్టు మాట్లాడుతుంది.

ఈరమ్మవ్వ ప్రజల మనసులో నిలిచిపోయేటటువంటి, సమాజ సముదాయంలో సంస్కృతి కలను నాటే కాయకాన్ని చాలా సంవత్సరాలుగా చేస్తూనే ఉంది.

ఏడు వేల పుటల, రెండులక్షల పంక్తుల ఈ కథన కావ్యాలను గానం చేయడమంటే సామాన్యమైన సాథననా?

ఈరమ్మ సంగీతసాథన లోకమే ఆశ్చర్యపోయేటటువంటిది!

ఆమె జీవితంలో వెనుతిరిగి చూసే మనిషి కాదు.

మొండిగా మునుముందుకు సాగే మనిషి

అలా వున్నందువల్లే ఈ రోజు కర్ణాటక రాజ్యోత్సవ పురస్కారం, నాడోజ పురస్కారం, జానపదశ్రీ పురస్కారం -ఇలా వందలాది పురస్కారాలు, సన్మానాలు, పతకాలు, గౌరవ చిహ్నాలు తన సరస్వతి కొప్పులో ముడిచిందామె.

ఈరమ్మ గొంతు అలా ఎందుకు అయ్యిందని, మందులు వేసుకోలేదా? చికిత్స చేయించుకోలేదా? అని అశ్వ రామును అడిగితే -*ఆమె ఎన్నడూ ఇంగ్లీషు మందులుకానీ, ఆయుక్వేద మందులు కానీ సేవించలేదు. చేప ఆకుల రసాన్నే తాగి జీవించింది. అలాంటి ఆమెకు ఏ రోగం వచ్చిందని అనుకుంటాం సార్‌? చనిపోయిన ఓ వృద్ద ఆత్మ ఆమె దేహంలో చేరుకోవటంతో అలా అయ్యిందని అనాలా సార్‌?” అని అతనన్నాడు.

తన ఇంటి పెద్దలు మాట్లాడుకునే రీతిలోనే అశ్వ రాము మాట్లాడి వుండొచ్చని అనుకున్నాను.

పెద్దల ఆత్మ ఆమెలో చేరటం అంటే ఏమిటి?

ఈ మాటల అర్ధాన్ని గ్రహిస్తే మహాకావ్యాల్లో కూర్చుని బయటికి రావటానికి ఎదురుచూసి లోలోపలే సతమతమ వుతున్నట్టుంది.

ఏమైనా కానీ, వయస్సుకు సహజమైన కొన్ని బలహీనతలు మనుష్యులందరికి వచ్చినట్టే ఈరమ్మకూ వచ్చాయి.

ఏదో జబ్బు అంటూ బళ్ళారి ఆస్పత్రి చేరిన తరువాత కూడా ఈరమ్మ వార్డులోని మంచం మీదే పాడటానికి తపించింది.

డాక్టర్లకు ఎక్కడలేని ఆశ్చర్యం !

“నేను పాడాలయ్యా మా ఊరికి వెళ్ళాలి అని పరితపించే ఈ మనిషిని చూస్తే, ఈ కావ్యపు బతుకుకు ఆమె ఎంతగా హత్తుకుని వుండాలి.

చివరి ఊపిరివరకూ ఆమె పాడే స్వరానికి ఊపిరైంది.

ఇప్పుడు లోకం దృష్టిలో కళాదేవత అయింది.

హళెదరోజికి వెళితే అందరూ ఈరమ్మ జ్ఞాపకాలను గుర్తు చేసుకునేవారే.

నేను ఈ తంబూర పట్టుకున్నాను. పాడుతున్నప్పుడు ఎక్కడైనా స్వరం తప్పితే ఈ నా తండ్రి సరిదిద్దుతాడు” అని అంటుంది ఈరమ్మ తంబూరను ప్రేమగా తడుముతూ.

ఆమె ఇంటికి వెళ్ళినపుడు-

“మీకు ఏమి పెట్టాలి స్వామి, ఈ అడవిలో ఏమీ దొరకదు స్వామి, కొంచెం అన్నం, చట్నీ ఇంతే మాఇంటి భోజనం. ఇదే తిందురు రండి” అని ఆహ్వానిస్తుంది.

తల్లివిద్ణలు వేరయ్యే కావ్యభాగాలను గానం చేసేటప్పుడు (బాలనాగమ్మ మహాకావ్యం) కన్నీరయ్యే ఈరమ్మ ఇప్పుడు మనకు జ్ఞాపకం మాత్రమే.

అయితే ఆమె వెలిగించిన కావ్యపు ప్రమిదలు వెలుగుతూనే ఉన్నాయి. ఒకటా? రెండా?

అనేక మహాకావ్యాలను పాడిన ఈరమ్మ అనేక తరాలను కలిపింది.

కన్నడ మహా విశ్వవిద్యాలయాలను, లోకపు జ్ఞాన పరంపరలను తన కావ్యం, కథల ద్వారా వెలిగించింది.

అందువల్లనే ఆమె గౌరవనీయమ్లైన నాడొజ పదవిని పొందింది.

జానపదశ్రీగా మెరిసింది.

అనుభవాలగనిలా ఉన్న ఈరమ్మ జీవితమే ఒక మహా కావ్యకథనపు దారి. ఈ దారిలో నడిచే సౌభాగ్యం కన్నడిగులది. తల్లినాడు తెలుగువాళ్ళది కూడా. ఈ రెండు సంస్కృతుల కలయికగా భావసేతువుగా ఈరమ్మ బతికింది. (అయిపోయింది)

5

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మే 2019