పుట:Ammanudi-May-2019.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కన్నడతోటలో విరిసిన తెలుగుపాట

బుర్రకథ ఈరమ్మ-సంచారి ఆత్మకథ

కన్నడ మూలం

అనువాదం

డా. నింగప్ప ముదేనూరు

రంగనాథ రామచంద్రరావు 9059779289

(ఏప్రిల్‌ సంచిక తరువాయి...)

చివరి రొజులు

( రెందు రోజులు చీకటి - రెండు రోజులు వెలుతురు)

ఈరమ్మది ఎన్నడూ ఇంకిపోనీ ఉత్సాహం.

వయన్సుకు తగినట్టు ముసలితనం ఆవరిన్తున్నప్పటికీ కావ్యగానంలో ఆమె ఇంకా యవ్వనవంతురాలు.

ముడుతలు పడ్డ చర్మం, కాంతివంతమైన ముఖం, చేతిలో తంబూర, చేతులకు మట్టి గాజులు, నుదురు నిందా విభూతి, వెండిలా తెల్లబడిన జుత్తు, సదా మెరుస్తున్న వెన్నెలలాంటి నవ్వు నోటిలో ఎర్రగా మెరుస్తున్న తాంబూలపు గుర్తులు చూస్తే భూమికి దిగిన అల్లమప్రభు అనుభావలోకమే దిగివచ్చినట్టుంది. 'నడిచినంతగా నాడు, పొందినంతగా భాగ్యం” అన్నది ఆమె అభి[ప్రాయం.

ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగానే ఉండేది.

ఆరోగ్యం కాపాడుకోవటం కోసం తానే స్వయంగా దివ్య బెషధాన్ని కనుక్కుని దాన్ని సేవిస్తున్నప్పటికీ ఎందుకో చివరి రోజుల్లో కృశించసాగింది.

గొంతుకు సున్నం పూసుకుని, నిరంతరం స్వరాలను, కథలను ధ్యానం చేస్తున్నట్టు ఉండేది.

ఈరమ్మకు గొంతులో ఏదో సమస్య తలెత్తింది.

దాంతో విచారంలో మునిగిపోయింది.

అయినప్పటికీ బుర్రకథా గానాన్ని ఆమె మానలేదు.

ఊరూరు తిరిగటం మానలేదు.

కథలు చెప్పటం ఆపలేదు.

చివరివరకూ కుమార రాముడి కావ్యాన్ని స్వాసి చిన్నమ్మ, బాలనాగమ్మ మహా కావ్యాలను గానం చేస్తూ జీవితాన్ని సాగించింది.

ఈరమ్మలోని ఆశు కవిత్వ ప్రతిభ అద్భుతమైంది.

కథలోని ఒక సంఘటన దొరికితే చాలు.

ఆ సంఘటనలోని ఒక పోగు పట్టుకునినా కథను ఇట్టే అల్లుకునిపోగల సామర్థ్యం ఆమె సొంతం.

ఊహల్లో అల్లుకున్న కథనాన్ని చక్కగా అఖివ్యక్తపరచగలిగే కళ ఆమెలో ఉంది.

కథావస్తువును గ్రహించి, దానికి మనస్సులోనే మెరుగులు దిద్దుకుని, తన సృజనాత్మకమైన కల్పనా చాతుర్యంతో శ్రొతలను మంత్రముగ్దులను చేసే శక్తి ఆమెలో ఉంది.

బు(ర్రకథలను పాడేటప్పుడు నృత్యం, అభినయం, కథలలో ఉపకథలను చెప్పటం, అలా చెబుతూ అందులో హాస్యం, వినోదం- ఇలా అనేక వైవిధ్యతలను అలవరుచుకుని కథను ఆసక్తికరంగా చెప్పటంలో ఆమె సిద్ధహస్తురాలు.

మితిమీరి ఆకువక్క్మలు నమలటం వల్లనే గొంతు నొప్పి వచ్చిందని నలుగురూ చెప్పినా ఈరమ్మ మానలేదు.

ఆత్మీయులు హెచ్చరించినా అలవాటు వదులుకోలేదు.

బుర్రకథలు చెప్పే తన కాయకానికి దూరం కాలేదు.

ఇలాంటి జానవద కళాకారులు పెదవులకు లిప్‌స్టిక్‌ పూయకపోతే ఏమిటి?

నోట నిరంతరం వెలిగే సూర్యుడి ఎరుపురంగుతో కూడిన తాంబూలం ఉండనే ఉంటుందికదా!

భోజనం అయిన తరువాత ఆకువక్కలతోపాటు కాచు వేసుకోవటం జానపదుల రోజువారీ అలవాటు.

అలాగే ఈరమ్మకూ ఆ అలవాటు ఉంది !

ఊరూరు పాడుతూ వెళ్ళేటప్పుడు ఇలాంటి గాయకులకు తాంబూలం ఇచ్చే ఉత్సాహం కావాలి.

పైగా ఈర్ష్య, అసనూయలతో ఎవరైనా మందుమాకులు పెదతారేమోనని ఆమె తల్లితండ్రులకు భయముండేది.

ఆ కారణంగా మందుమాకులకు విరుగుడుగా అమాయకురాలైన ఈరమ్మ ఎప్పుడూ తన దగ్గర యాలకులు ఉంచుకునేది.

తాంబూలంలో యాలకుల ఫొడి కలుపుకుని ఆకువక్మలు వేసుకునేది.

అలాంటి ఈరమ్మకు ఇలా అయింది కదా !

అలాంటి మహాకావ్యాల గనీ మూగబోతుందని తెలిస్తే ఆమె

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మే 2019

49