| క్రమ. సంఖ్య. | పిక్కలు/పప్పులు | దొరికే కాలం | సుమారుగా నెలకు ఎన్నిసార్లు తింటారు/తినేవారు | ఉపయోగాలు |
|---|---|---|---|---|
| 16. | బొబ్బర్లు | ఎండాకాలం | 5-6 | కాళ్ళ వాపులు తగ్గిస్తాయి, మంచి బలం |
| 17. | అలసందలు | ఎండాకాలం | కిడ్నీలను శుభ్రపరుస్తాయి | |
| 18. | మినుములు | శీతాకాలం | బలాన్నిస్తాయి, రొంపను నివారిస్తాయి | |
| 19. | బస్తరు పిక్కలు | శీతాకాలం | ||
| 20. | జొట్ట పిక్కలు | శీతాకాలం | బలాన్నిస్తాయి, రొంపను నివారిస్తాయి | |
| 21. | కొండ కందులు | శీతాకాలం | శరీరానికి వేడిని, శక్తిని అందిస్తాయి | |
| 22. | ఉలవలు | శీతాకాలం | చిన్నపిల్లలకు, బాలింతలకు శక్తిని ఇస్తాయి. గర్భినీ స్త్రీలకు మంచిది,
చేస్తుంది. ఫిట్స్ వ్యాధి నివారణకు, ఊబకాయం తగ్గడానికి వాడుతారు. | |
| 23. | అనుములు | శీతాకాలం | ||
| 24. | తిమిరేలు | శీతాకాలం | చర్మానికి వేడినిస్తాయి | |
| 25. | టొండగుడ్ల కందులు | |||
| 26. | కందులు | వేడిని పెంచుతాయి. బలాన్నిస్తాయి | ||
| 27. | పెసరాలు | మలేరియాను తగ్గిస్తాయి | ||
| 28. | శనగలు | బలాన్నిస్తాయి | ||
| 29. | నువ్వులు | బలాన్నిస్తాయి, తలలో వేడిని తగ్గిస్తాయి. |
ముగింపు :
పైన పేర్కొనబడిన అన్ని రకాల ఆకు కూరలు, సహజ సిద్ధమైన పండ్లు, పిక్కలు / పప్పులు, దుంపలు మొదలైనవన్నీ గతంలో ఎంతో విస్తారంగా దొరికేవి, కానీ నేడు అవి చాలా పరిమితం అయిపోయాయి. కొన్ని రకాలు దాదాపుగా నశించి పోయాయని చెప్పవచ్చు. ఇందుకు ప్రధాన కారణం రోజు రోజుకూ అటవీ విస్తీర్ణం తగ్గిపోవడమే. అలాగే ప్రస్తుతం ఆదివాసీ సమాజంలో ముఖ్యంగా యువతరంలో వస్తున్న ఆహారపు అలవాట్లలోని మార్పు కారణంగా అడవిలో దారికే ఫలాలు, ఆకులు, దుంపలు తినడం అనేది బాగా తగ్గిపోయింది. నిజానికి, దుంపలు త్రవ్వడం చాలా కష్టమైన పని. అయితే అప్పట్లో, ఆహారం దొరికేది కాదు కాబట్టి తప్పనిసరై అడవికి వెళ్ళి వాటిని సేకరించుకోవడం తప్పా వేరే మార్గం ఉండేది కాదు. అయితే ఇప్పుడు ఇతర రకాల ఆహారం దొరుకుతుందడం వల్ల యువత ఎవరూ కష్టపడి ఈ దుంపలు గ్రవ్వి తెచ్చుకోవడానికి ఇష్టపడడం లేదు. అలాగే తనిడం లేదు కూదా. అలాగే ఆదివాసీ రైతులు సాగు చేసే వివిధ రకాల పప్పు దినుసులు కూడా క్రమేపీ తరిగి పోతున్నాయి. (ఉదాహరణకు పై పట్టికలో మార్కుతో గుర్తించబడిన ఆహార పదార్దాలు ప్రస్తుతం చాలా అరుదుగా కన్పిస్తున్నాయి. 25 సంవత్సరాల క్రితం ఇవి అధిక మొత్తంలో కనీపించేవి).
ఇందుకు కారణాలు అనేకం.
ఆ రోజుల్లో పప్పు దినుసులు ముఖ్యంగా శీతాకాలంలోనే ఎక్కువగా చేతికి వచ్చేవి. అయితే వాటినీ దాచుకొనీ, ఇంచుమించు సంవత్సరం ఫొడవునా నెలకు రెండు మూడుసార్లు ఒకప్పుడు ఆదివాసీ ప్రాంతాలలో మంచి పౌష్టికాహారం అందించిన ఈ ఆహార పదార్థాలు నశించిపోవడం బాధాకరం, వాటిని ఎలాగైనా కాపాడుకోవడం ఎంతైనా అవసరమనేది ఆయా ఆదివాసీ గ్రామాల్లోని పెద్దల అభిప్రాయం.
(మన్నెంలో పత్రిక జనవరి - మార్చి 2019 సంచిక సౌజన్యంతో)
- శిశువు శారీరక వికాసానికి తల్లిపాలు
- మానసిక వికాసానికి తల్లి భాష
- గుండెలోతుల్లోంచి వచ్చేదీ, మనసు
- విప్పి చెప్పగలిగేది అమ్మనుడిలోనే.