పుట:Ammanudi-June-2019.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(ఎన్‌ఎస్‌ఎస్‌) విద్యార్థులు, స్వచ్చంద సేవా సంస్థలపై ఆధారపడి, కేరళలోని ఎర్నాకులం జిల్లాలో, కొట్టాయం పట్టణంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఇంతలో ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 1990వ సంవత్సరాన్ని అంతర్జాతీయ అక్షరాన్యతా సంవత్సరం (ఐఎల్‌ వై) గా ప్రకటించగా, దేశంలో 1990 జనవరి 22న ఐఎల్‌వైని ప్రారంభించారు. అప్పటికే సంపూర్ణ అక్షరాస్యతా ఉద్యమం కొనసాగుతున్న ఎర్నాకులం జిల్లాను 1990 ఫిబ్రవరి 4న మొట్టమొదటి సంపూర్ణ అక్షరాస్యతా జిల్లాగా ప్రకటించారు. ఎర్నాకులం జిల్లా, కొట్టాయంల విజయస్స్ఫూర్తితో కేరళలోని అన్ని జిల్లాలలో అమలు చేసి, 1991 ఏప్రిల్లో సంపూర్ణ అక్షరాస్యతా రాష్ట్రంగా ప్రకటించారు. ఆ విజయాలతో ఎన్‌. ఎల్‌ ఎం. తన 80 మిలియన్లకు లక్ష్యాన్ని తిరిగి 100కు పెంచి, 1999కల్లా దేశంలో అన్ని జిల్లాలలో అమలు చేసి, 100 మిలియన్ల నిరక్షరాస్యులను అక్షరాస్యులను చేయాలన్న లక్ష్యాన్ని ప్రకటించింది. టి.ఎల్‌ సి. విజయాలు దేశంలో జీవన పర్యంత విద్యా కార్యక్రమాల ఏర్పాటుకు బాటలు వేశాయి. వయోజనవిద్యలో 1. సంపూర్ణ అక్షరాస్యతా ఉద్యమం (టిఎల్స్‌), 2. అక్షరాస్యతానంతర కార్యక్రమం (టిఎల్ష్ ), 3. నిరంతర విద్యా కార్యక్రమం (సిఇపి) లు భాగాలు. జీవన పర్యంత విద్యా కార్యక్రమం, 9వ పంచవర్ష ప్రణాళికా కాలంలో (1997-2002) ప్రారంభమై 11వ పంచవర్ష ప్రణాళికా కాలంలో (2007-12) సెప్టెంబర్‌ 2009 వరకు కొనసాగింది.

సాక్షరభారత్‌ కార్యక్రమం(ఎస్‌.బి.పి) - 2009:

ఎన్‌ఎల్‌ ఎం ఎన్ని ప్రయత్నాలు చేసినా నిరక్షరాస్యత పెను సమస్యగా ఉండి పోయింది. 2001 జనాభాలెక్కల ప్రకారం, 15 సం॥లు దాటిన నిరక్షరాస్యులు 259. 52 మిలియన్లు (సుమారు 26కోట్లు). అదే సమయంలో భారత ప్రభుత్వం అక్షరాస్యురాలైన మహిళ - ఒక నీర్ణయాత్మక శక్తిగా దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించ గలదని మహిళా సాధికారత, అక్క్షరాస్యతలు కీలక ప్రాధాన్యతలుగా ప్రకటించింది. 11వ పంచవర్ష ప్రణాళికలో పేర్శొనగా భాగస్వామ్య అభివృద్ది నినాదం స్ఫూర్తి... స్త్రీ పురుష అక్షరాస్యతా తేడాను తగ్గించకుండా సాధ్యపడదు కాబట్టి, మహిళా సాధికారతకు ప్రాధాన్యమిచ్చారు. సామాజిక, ఆర్థిక అఖివృద్ది.. అక్షరాస్యత ముఖ్యంగా మహిళా అక్షరాస్యతతోనే సాధ్యమని భావించిన ఎన్‌ఎల్‌ఎం మహిళా అక్షరాస్వతకు ప్రాధాన్యత నిస్తూ దిద్దుబాట్లతో సాక్షరభారత్‌ కార్యక్రమాన్ని ప్రకటించారు. కార్యక్రమాన్ని అప్పటి ప్రధాని డా.మన్నోహన్‌ సింగ్‌ 2009 సెప్టెంబర్‌ 8న అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని లాంఛనంగా ప్రారంభించారు. 2009 అక్టోబర్‌ 1 నుండి అమల్లోకి వచ్చింది. చదువుకునే అవకాశం పొందని, వయసు దాటిపోయి, ప్రస్తుతం అక్షరాస్యత, ప్రాథమిక విద్య, వృత్తి విద్య భౌతిక, మానసిక అభివృద్దులకు సంబందించిన విద్య, కళలు, శాస్తాయ పరిజ్ఞానం, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇట్లా ఏ అంశంలోనైనా నైపుణ్యాలు పెంచుకోవాలనుకుంటున్న వారికి అవకాశాలను అందించే ఏర్పాట్లు జరిగాయి. సరికొత్త సాక్షరభారత్‌ కార్యక్రమ ప్రాథమిక లక్ష్యం 80% జుతీయ అక్షరాస్యత. స్త్రీ పురుష అక్షరాస్యతా తేడాను 10%నికి తగ్గించడం, వివిధ ప్రాంతాలు, సామాజిక వర్గాల మథ్య తేడాలను కనిష్టం చేయడానికిగాను మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఇంకా ఇతర వెనుకబడినవర్గాలపై దృష్టిని కేంద్రీకరించారు. 11వ ప్రణాళిక అంతానికి లక్ష్యాలను సాధించలేక పోవడంతో 12వ పంచవర్ష ప్రణాళికకు కొనసాగించారు. ఆపైన మరో సంవత్సరం కొనసాగించారు.

ఇప్పటివరకు మన కార్యక్రమాల ప్రాధాన్యతలు -లోపాలు:

1.సామాజిక విద్యా కార్యక్రమాల అవగాహన, సామాజిక భాగస్వామ్యం, సామాజిక కార్యకర్తలు, వయోజన విద్యా శాఖ శిక్షణ, ఇతర కార్యక్రమాలకు ఉద్దేశించిన జనతా కాలేజీలు 3వ పంచవర్ష ప్రణాళిక తరువాత ఏమయ్యాయో తెలియదు.

2. మొదటి ౩ పంచవర్ష ప్రణాళికలలో సహకారోద్యమం, విస్తరణ ప్రాజెక్టులతో నడిపించిన సామాజికాఖివృద్ది (కమ్యూనిటి డెవలప్ మెంట్ కార్యక్రమాలు ఆ తరువాత లక్ష్యాలనుంది దారి మళ్లాయి.

3. సర్వతోముఖ అభివృద్ధికి ఉద్దేశించిన సోషల్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాం మూడు ప్రణాళికల్లో రేకెత్తించిన ఉత్సాహం చల్లబడి చివరికి వయోజన విద్యకు పరిమితం అయిపోయింది.

4 మొదటి మూడు ప్రణాళికల కాలంలో అనుకున్న ఎన్‌. జీ. ఓలు, పంచాయితీరాజ్‌ వ్యవస్థలు, ప్రైవేట్‌ సంస్థల భాగస్వామ్యం స్థిరంగా నిలవలేదు.

5. నేషనల్‌ ప్రోగ్రామ్ ఫర్‌ అడల్ట్‌ ఎడ్యుకేషన్‌ - ఎన్‌.వి.ఎ.ఇ. ఒక అనియత విద్యా కార్యక్రమం, ప్రయోగాలు,అధ్యయనాల తరువాత రూపొందిన మొదటి వ్యవస్థీకృత కార్యక్రమం. విశ్వవిద్యాలయాలలో వయోజన విద్యా విభాగాలను ప్రారంభించాయి. ఫలితాల నివేదికలు అందలేదు. యు.జి.సి. పట్టికల్లో కోర్సులు ప్రారంభించి నట్లుగా మాత్రమే తెలుస్తోంది.

6. ఫార్మల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఫంక్షనల్‌ లిటరసీ (ఎఫ్‌.ఇ. ఎఫ్‌.ఎల్‌. పి.) కార్యక్రమం ఆహారోత్పత్తి, హరిత విష్ణవాలలో కొంత సాధించగలిగినా, దేశం వ్యవసాయోత్పత్తులలో అనుకున్న స్వయం సమృద్ది సాధించలేకపోయింది. గోధుమ, చెరుకు, వరి, పప్పుధాన్యాల ఉత్పత్తి విషయంలో చాలా దేశాల కన్నా వెనుకే ఉండిపోయింది. 100 జిల్లాల (తరువాత 146 జిల్లాలను విస్తరించారు) లో కార్యక్రమాన్ని అమలు చేయాలన్న లక్ష్యం అమలయ్యాక ఈ కార్యక్రమాన్ని నిలిపేశారు.

7. వ్యవస్టీకృత నిర్మాణంతో ప్రారంభించిన నేషనల్‌ ప్రోగ్రాం ఫర్‌ అడల్డ్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌.పి.ఎ.ఇ) 10 ఏండ్లపాటు కొనసాగాక అప్పటివరకు ఉన్న వ్యవస్థను మధ్యంతరంగా 1988 లో మార్చేశారు.

8. వయోజన విద్యా కార్యక్రమాలను వేగవంతం చేసేలా పరిశోధన, మూల్యాంకనం, సాంతేతికాది సహకారం అందించేందుకు -1991, జనవరిలో ఏర్పాటు చేసిన నేషనల్‌ ఇన్ స్టట్యూట్‌ ఆఫ్‌

భాష లేకపోతే భావంలేదు;నీ భావాల్ని నీ భాషలో చెప్పడమే సరైనది

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూన్ - 2019

25