పుట:Ammanudi-June-2019.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ముఖ చిత్ర కథనం

సన్నిధానం నరసింహశర్మ 9292055531

నవయుగ వైతాళికుడు

కందుకూరి వీరేశలింగం స్పూర్తి ఇప్పటికి అవసరమే!



బాల్య వివాహాలు ఇప్పుడు జరగడంలేదు నిజమే! వాటికి వ్యతిరేకంగా వర్తమానకాలంలో ఉద్యమం అక్మరపడదు. స్త్రీ పునర్వివాహాలు ఇప్పుడు సమస్యకాదు. దాని గురించి ఉద్యమం నేడక్కడ పడదు. ఇందువల్ల వీరేశలింగంం ప్రబోధాలు స్ఫూర్తి నేటికి అవసరం లేదనుకుంటే - అది పాక్షిక ఆలోచనా సంకుచితత్వమే అవుతుంది. కందుకూరి వీరేశలింగం పంతులుగారి కాలాన్ని భావించుకుని ; నాటి ప్రధాన సమస్యలైన వాటిని ఎదుర్కొడంలో ఆయన ఆరాటాలూ పోరాటాలూ, నమ్మినవాటి పట్ల కుదురుతలపులు తలచుకొంటే ఒడలు జలదరిస్తుంది. చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది.


ప్రజల్లో ఛాందసులు బానిస తలంపులు ; మత పీఠాధిపతుల గిరి గీసుకుని గుండ్రంగా తిరిగే మౌడ్యాలు, ముందు మేలు చూపే వ్యవస్థలో కొందరు ధర్మశాస్త్రాలకు వక్రభాష్యాలు చేసే ధోరణులు; కొత్తలకు స్వాగతమెత్తడంలో సమకాలీన ప్రాపంచిక జీవన దృక్పధాలను చూసుకోకపోవడం - ఇటువంటి ఒకానొక సామూహిక వ్యతిరేక వాతావరణంలో ఆయన ప్రణాళికాబద్ద క్రియాత్మక సమర పాత్ర అషామాషీ కాదు;

ఓరోరీ జంగమా వీరేశలింగమా అని అంటూ దుమ్మెత్తి పోయడాలుండేవి. పాడయిపోయిన వాళ్లు ఆయన్ను పాడైపోతున్న వాడిగా భావించడం. అల్ప సంఖ్యాకులైన ఆనాటి ప్రగతిశీలురు ఆయనకు తోడ్పడుతుంటే వారిని నిరుత్సాహ పరచడం, భయపెట్టడం, వెలి వేయడం. స్త్రీ పునర్వివాహాలు జరిపించేటప్పుడు కావళ్లతో మంచినీళ్ళు తెచ్చేవారినీ వారించడం. కందుకూరి ఇల్లాలు రాజ్యలక్ష్మమ్మగారే తానే గోదావరికి వెళ్ళి బిందెలతో నీళ్ళు తేవడం ఇటువంటివెన్నో జరిగాయి.

ముక్కుపచ్చలారని వారికి బాల్య వివాహాలు చేయడం వీరేశ లింగాన్ని కలచివేసింది. స్త్రీ పునర్వివాహాల్ని ఆయన అంగీకరింపజేయడంలో ఆయనకు సంప్రదాయపు వ్యక్తిగా చెబితే తప్పులేదేమో.

ధర్మశాస్త్రాలు లోతుగా చదివి, కువ్వాఖ్యాన దురంధురుల్ని ఆ ధర్మశాస్త్రంలోని అంశాలనే ఎత్తిచూపి స్రీ పునర్వివాహాలు శాస్త్ర సమ్మతమని వాదించడంలో ఆయన నైపుణ్యం పాండిత్య పునాది నుండీ పుట్టింది.

మనం ఇక్కడ ఓ అంశాన్ని గమనించాలి. వివాహ సంస్మరణ అంశాల్లో ఆయన ఏకకుల దృష్టి వుందనేది వాస్తవం. అయితే ఆ కులీనుల ఛాందసులతోనే ఆయన భావ నమరం సాగించినదీ గమనార్హం.

హిత సూచని విషయంలో కావచ్చు తనకన్నా ముందే రాయబడిన రంగరాజు చరిత్రను తొలి నవలగా చెప్పకపోవడం కావచ్చు. కొన్నిటిలో తాను ప్రథముడినని చెప్పుకోవడంలో కావచ్చు, సమాంతర సంస్కృతి ఆలోచించడంలో కావచ్చు, స్వాతంత్య్ర సమర సంబంధ జాతీయభావాల్లో కావచ్చు. భోగము వారి విషయంలో పద ప్రయోగ విషయంలో కావచ్చు. - పంతులుగారి పై నున్న విమర్శలు ఆలోచనీ యాలూ ఆక్షేపణీయాలూ కావచ్చు. కానీ స్త్రీ విద్యా విషయంలో, స్త్రీ జన సముద్ధరణ విషయంలో దురాచారాల విషయంలో, అశాప్తీయ మౌడ్యాల అంశాల్లో ఆయన సాగించిన సమరాలు అమరాలే! కాకినాడ పి.ఆర్‌.కళాశాలలో ఉద్యోగానికి దరఖాస్తు చేసిన అచ్చమైన బ్రహ్మ సామాజికుడు, మచ్చలేని చరిత్రగల రఘుపతి వేంకటరత్నం నాయు

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూన్ 2019

21