పుట:Ammanudi-June-2019.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

డుగారిని కాకినాడ తీసుకువెళ్ళి సిఫార్సు చేసిన అర్హతను గౌరవించిన వ్యక్తి కందుకూరి. తరువాత కాలాల్లో కొన్ని చారిత్రక కారణమే విభేదాలు వచ్చినా నాళం కృష్ణారావుగారిని సామాజిక కార్యకళాపాల్లో కలుపుకొన్న సామాజిక సేవకుడు వీరేశలింగం.

స్త్రీ విద్య ఫలానా స్త్రీలకే వుండాలని ఆయన ప్రవచించిన దాఖలాలు లేవు.

స్త్రీ పునర్వివాహాలు జరగాలని అభిలషించడంలో కందుకూరికి మానవీయ కోణం వుంది. బాల వితంతువులు తరువాత పడుపు వృత్తిలో దిగరాదని; భ్రూణహత్యలు నివారించాలనే ఆలోచనతో స్త్రీ పునర్వివాహాలు జరగాలనేది ధ్యేయం.

“బాల వితంతువులు తమ ద్వితీయ వల్లభులతో నిరంతర సౌఖ్యమనుభవించుచుండగా కన్నులు పండువుగా గనుగాన గలిగెడు భాగ్యమెప్పుడు లభించునా” యని నా హృదయములో నేనెంతో అభిలషిస్తున్నా "నని వీరేశలింగం స్వీయచరిత్రలో రాసుకున్నారు - ఈ వాక్యాన్ని అక్షరాక్షరము పట్టి పట్టి చదివి భాదిస్తే వీరేశలింగం గారికి స్త్రీ జన బాధల, సౌఖ్యాలపట్ల ఉన్న శ్రద్ధ మరొక్కరికెవరికైనా ఇంత లోతు తలపు, సహజానుభూతి ఉందా అనేది మన ఎదల్లో కదలాడుతుంది.

వీరేశలింగం సాహిత్య సేవ : వీరేశలింగం ఒక విద్వత్కవి. సంస్కృత నాటకానువాద దక్షుడు, ప్రజోపయోగ ప్రహసన గ్రంథ రచయిత వ్యాకరణ గ్రంథ రచయిత శాస్త్రజ్ఞాన రచయిత ఉపన్యాసాలను కరదీపికలుగా ముద్రించిన ఉద్యమ ప్రచారవాజ్మయ రచయిత. జీవిత చరిత్రల రచయిత పూర్వ గ్రంథ సంస్కార కర్త స్వీయ చరిత్ర కర్త సంఘ సంస్మరణోపన్వాసాల ఫొత్తాల కర్త, వీరేశలింగం పంతులు ప్రయోజనకర శతాధిక గ్రంథకర్త.

ఆయన రచనలు తొలినాళ్ళలో 12 సంపుటాలుగా వెలువడ్దాయి. ముఖ్యంగా ఆంధ్ర కవుల చరిత్ర ఆయన పరిశోధనల సంధానాల సంయుక్త శ్రమఫలం. 21 ప్రాబీన గ్రంథాల పరిష్కర్త, ఇన్ని పుస్తకాల రచన మామూలు అంశం కాదు.

ఆయన జీవితం సాహిత్వ సృజనకు, సంఘ సంస్కార సేవలకు పత్రికి నిర్వహణకు అంకితమైంది. వీటితో ఊరుకున్నారా? తన ఆశయాలు ఫలాల పంటలు ఎపుడూ పండుతూ ప్రజలకు వినియోగపడాలని పదికాలాల పాటుందే సంస్థల్ని స్థాపించారు. ప్రార్ధనామందిరం, రాజ్యలక్ష్మీ నివాసం. ఆంధ్రదేశంలోనే ప్రథమ పుర మందిరం రాజమహేంద్రవరంలో నిర్మించారు. ఆ పురమందిర నిర్మాణానికి తొలుత కొందరి వద్ద ఆయన విరాళాలు తీసుకోగా ఆయనకు అవినీతి అంటకట్టే ప్రయత్నాలుగా చేయగా బాధపడి ఎవరి సొమ్మును వారికి తిరిగిచ్చేసి కేవలం తనకు తన పుస్తకాల అమ్మకాలపై వచ్చే ధనంతో పురమందిరాన్ని నిర్మించి నిస్వార్థ అభిమాన ధనుడాయన.

చెన్నపురిలో, బెంగుళూరులో సమాజహిత కార్యక్రమాలకై మందిరాల్ని నిర్మించారు. థవళేశ్వరంలో బాలికా పాఠశాల రాజమండ్రిలో ఆస్తికోన్నత పాఠశాల - ఇలా ఇలా ఎన్నో భవన నిర్మాణ కార్యక్రమాలు చేపట్టి ప్రజాహిత కార్యక్రమాలకు నెలవులుగా చేశారు. వివేకవర్దనీ ప్రచురణాలయాన్ని నెలకొల్పి రచనోద్యమానికి బాసటగా చేసుకున్నారు.

ఎంతటి గొప్ప ప్రణాళికలు? ఎట్టి పట్టుదల పనితనాలు! ఎంతటి ముందు సేపు చూపులు! ముదుసలితనం వచ్చిన, పీసస జబ్బు వచ్చినా, నమ్మనవారిలో కొందరు దూరమైపోయినా ఒక మొండి పట్టుదలతో సమాజహితకారిణీ ధ్యేయాలను వదలని మహానుభావుడు.

1987లో చిలకమర్తి లక్ష్మీనరసింహం వీలేశలింగం చరిత్రను చదివితే అందులో వందలకొలది నీతి పాఠాలుంటాయని, వీరేశలింగ స్వీయచరిత్ర పఠనం అంటే ఆంధ్రదేశం యొక్క సాంఘిక చరిత్ర పఠనంగా తెలిపారు.

ఆరుద్రగారు సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రలో వీలేశలింగ విరచిత 'పుస్తకాల జాబితా తయారు చేస్తే ఏదో పుస్తకాల వ్యాపారి కేటలాగులా ఉంటుం 'దన్నారని తెలిపారు. అంటే కందుకూరి గ్రంథ రచనలకు అంత విస్తృతి వుందని మాట;

వీలేశలింగం నాస్తికులు కారు. బ్రహ్మ సమాజ ఆస్తికులు విగ్రహారాధన వ్యతిరేకులు ఉపనిషత్తులు ప్రబోధించిన వానిని వాని సారాంశాలను గ్రహించిన 'ఏకేశ్వరోపాసన ' ఆయనది.

అంతకు మించి సంఘద్రోహులను 'ఏకేసే” కార్యోపాసన ' ఆయనది.

భాషాసేవ

భాషా సేవ, సాహిత్య సేవ పరస్పర ఏకమార్ల సంజనితాలే అయినా ప్రత్వేకంగా బాగులెంకగా కూడా కొంత ఆయన పాత్ర వహించకపోలేదు.

వీరేశలింగం - ప్రత్యేకంగా వాడుకభాషతో యుద్ధం చేసేటంతటి గ్రాంధికవాది కాదు, ఒకరకంగా ఆయనది గ్రాంధిక భాషానుసరణమే కాని గ్రాంధిక వాదానుసరణం కాదు, ఆయన 'పటాహఖం కృతుల... అభంగతరంగమృదంగ ' గ్రాంధికభాష కాదు...ఒడిదుడుకులులేని ఏకప్రవాహశైలి, స్పష్టభావ ప్రకటన ఆ శైలికి భూమిక. సరళ గ్రాంధిక సౌందర్య దర్శనం కలుగుతుంది.

కందుకూరి 25 ఏళ్ల చిన్న వయస్సులోనే చిన్నయసూరి బాల వ్యాకరణం లోటు పాట్లను ఎన్నగలిగాదు. కొక్కండ వారు పుస్తకాలే కాదు పత్రికలు కూడా గ్రాంధిక శైలిలో ఉండాలంటే దానిని ఖరాఖండీగా ఖండించారు.

పత్రికల భాష గ్రాంధిక ఫణితినున్న
పండితులుగాని వారికి పనికిరావు
పత్రికోద్దేశమే కొఱవడునుదాన
గాన నెవుడు సర్వజనోపకారమొదవ

పామరులకును తెలియంగ వ్రాయవలయు అని నిర్ద్యందంగా తన హృదయాన్ని నాటబలికారు.

తెలుగును బోధించడం కాదు ; తెలుగులోనే అన్నీ బోధించాలి

22

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూన్ 2019