ప్రకరణము ౭ - శివాజీ
37
అప్పుడు శివాజీ ఒక ఉపాయముచేసెను. మొగలాయీ వారినుండి బిజాపురమును కాపాడునట్టిపనిని తప్పించుకొనెను. ఎట్లనఁగా బిజాపురముమీఁదికి దండెత్తనుండిన మొగలాయీ రాయబారితో తానొక సంధి కుదుర్చుకొనెను. అంతకు రెండేండ్ల నుండి మొగలాయీలు శివాజీతో యుద్ధముచేసి విసిగియుండిరి; తమకు భయపడి భలోల్ఖాను శివాజీతో చేరఁగానే వారికిని కొంతకష్ట మైనది, భలోలుఖానుమీఁద పైయెత్తుగా మొగలాయీ రాయబారి తానును శివాజీతో సంధి కోరినందువలన శివాజీకి మంచిదేయైనది. తన ద్రవ్యాకర్షణమునకును దక్షిణ దేశ దండయాత్రకును అనుకూలమని శివాజీ వెంటనే ఒప్పుకొని, తాను కర్ణాటకదేశముమీఁద దండెత్తి తిరిగివచ్చులోపల దాదాపొక సంవత్సరకాలము బిజాపురమునకు మొగలాయిల వలన బాధలేకుండిన తాను శ్రమపడకయే వారిని రక్షించినట్లగునని, అట్టియేర్పాటుమీఁద సంధిషరత్తులు కుదిర్చెను.
ఇన్ని వ్యవహారములలోను మాదన్నమంత్రియున్నాఁడు. శివాజీయుద్దేశము నాతఁడు కొంతవఱకు గ్రహించెను. దక్షిణ దేశములమీఁదికి శివాజీ కొల్లఁగొట్టుటకు బయలుదేరిన గోలకొండ గతి యేమగును? బిజాపురమును తాత్కాలికముగా కాపాడుటయైనది. మొగలాయీలవలన భయము లేదు. మఱి శివాజీనికూడ స్నేహితుని చేసికొనిన మొగలాయీలను పూర్తిగా నిలుపవచ్చునని తలఁచి మరల శివాజీతో రాయబారము