పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



ప్రకరణము ౨౨ - అబ్దుల్‌రజాక్‌లారీ కడపటియుద్ధము

ఈలోపల తానాషాయెుక్క సర్దారులలో చాలమంది ఔరంగజేబుయొక్క స్కంధావారమును ప్రవేశించి పాదుషా కడ మర్యాదలను పదవులను సంపాదించుకొనసాగిరి. ఇట్లుండఁగా తానాషాకోటలో నొక కింవదంతి పుట్టెను. గోలకొండసర్దారులు ప్రధానులగువారు మువ్వురలో నొకఁడైన షేక్‌మిౝహాజ్ అనువాఁడు లోలోపల పాదుషాకు సహయముచేయుట కొడంబడి యున్నాఁడని తానాషాతో కొందఱు ఆప్తులు చెప్ప సాగిరి. తానాషా ఆమాటలను నమ్మి షేక్‌మిౝహాజును చెఱఁ బెట్టించెను. ఇప్పడు తానాషాసర్దారులలో నమ్మకమైనవారు ఇరువురే మిగిలిరి. ఒకఁడు అబ్దుల్‌రజాక్‌లారీ, రెండవవాఁడు అబ్దుల్లాఖాౝపానీ. ఈయిరువురును తమశక్తినంతయు వినియోగించి తమ సుల్తానుకొఱకు పాటుపడుచుండిరి.

పాదుషా అబ్దుల్ రజాక్‌లారీకడకు దూతను పంపెను. ఆఱువేల సైన్యమునకు ఆధిపత్యమును పెక్కు గౌరవములను ఇచ్చున ట్లొకఫర్మానా వ్రాసెసు. రజాకునకు చాలకోపము వచ్చెను. రాజభక్తినుండి ఎంతమాత్రము ఆతఁడు చలింపక పాదుషాదూతను తిరుగఁగొట్టెను. తనప్రాణములకు సైతము లక్ష్యము చేయక ఆ ఫర్మానాను కొనిపోయి, కోటగోడమీఁద నిలిచి, పాదుషాసైన్యమునకు చూపుచు దానిపై నుమ్మివేసెను. నానావిధములుగా వెక్కిరించి తుదకు చింపి పాఱవేసెను. పాదు

8