206
అబలాసచ్చరిత్ర రత్నమాల.
మీస్వాధీనపఱచెదను. ఇది మీకసమ్మతమేని నాబొందిలోఁ బ్రాణము లున్నంతవఱకును యుద్ధము చేయఁ గలదానను."
రాజామానసింహుఁ డామె కోరినసంగతుల కనుమతించి పట్టణము వశపఱచుకొని ప్రతాపాదిత్యునిఁ గొని డిల్లీకుఁ బ్రయాణ మయ్యెను. రాణీ జసరేశ్వరి భర్తయం దధికభక్తి గలదిగాన నట్టిసంకట సమయమునందు అతని విడువక వెంబడించెను. కాని ప్రతాపాదిత్యుఁడు కారాగృహవాసదు:ఖము నోర్వఁ జాలక డిల్లీమార్గముననే గతప్రాణుఁ డయ్యెను. కాన నా కాలమునం గలయాచారప్రకారము జసరేశ్వరి సహగమనము చేసెను.
ఇట్టి స్త్రీ లేకదా సాధ్వీమణులనం దగియుందురు. జసరేశ్వరివంటి రూపగుణములు గలశూరస్త్రీ దొరకినను నిర్భాగ్యుఁ డగు ప్రతాపాదిత్యుఁ డామె సహవాసము వలన ఫలము నెంతమాత్రమును బొందకుండగా తనదుష్కర్మమువలన నామెకు దు:ఖముకలుగఁ జేసెను. జసరేశ్వరి కట్టిదుష్టుఁడు భర్తయయినను అతనియం దెంతమాత్రమును దిరస్కారబుద్ధిలేక సన్మార్గప్రవర్తకునిఁ జేయ యత్నింపుచుండెను. ఇదియేభార్య ధర్మము; గాని యది భర్తధర్మము గాదు.