పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రభుత్వమునుజూచి మెచ్చి యా సంస్థానమును గురించి యిట్లు వ్రాసియున్నాడు:-

"భూపాలసంస్థానాధీశ్వరు లెప్పుడును రాజ్య కార్యధురంధరత్వమునకును, రాజభక్తికిని, ఔదార్యమునకును బ్రఖ్యాతులయి యున్నారు. ప్రస్తుతపు సింహాసనాధీశ్వరియొక్క తల్లిగారగు శికందరు బేగముగారు 1857 వ సంవత్సరమున బ్రిటిషువారికి (ఇంగ్లీషువారికి) జేసిన సహాయ మెప్పుడును మరవదగినదికాదు. ఇప్పటి బేగముగారు, తల్లిగారిరాజ్యము గ్రహించినటులనే, ఆమె సద్గుణములనుగూడ గ్రహించినది. ఈమె, సారాసార విచారము గలిగినట్తియు, బుద్ధివైభవము గలిగినట్టియు, రాజ్యకర్త్రియని పేరొందినది; ఆమె లోకోపకార ప్రదములైన యనేక కార్యముల కొర కత్యంత ధనమును వ్యయపరచినది. ఈమె రైళ్ళు కట్టుటకు సహాయము జేసినది; భూపాలులోని లోకులకొరకు నద్వితీయ మయిన జలము దెప్పించినది. తాను కొన్ని దినములక్రిందట తన సైన్యములలో నుండి యిచ్చెదనన్న సైన్యమును బ్రిటిషువారు తీసికొనవచ్చుననియు, ఆ సైన్యము హిందూదేశ సంరక్షణార్థ ముపయోగింప వలసినదనియు, నీమె నాకు నేడు తెలియజేసినది."

ఈ వంశస్థు లిటులనే కీర్తినిజెంది, శికందరుబేగము వంటి యనేక బేగములచే భూషితులగుదురుగాక యని ఈశ్వరుని ప్రార్థించి, యీ చరిత్రము సమాప్తి చేయుచున్నాను.


________