పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శికందరు బేగము

   * "సుచింత్యచోక్తం సువిచార్య యత్కృతం
     సుదీర్ఘ కాలేపి నయాతి విక్రియాం"

నర్మదానదికి నుత్తరమున మధ్య హిందూస్థానములో భూపాళమను సంస్థానమొకటి కలదు. శిందేసర్కారువారి గ్వాలేరు సంస్థానమీ సంస్థానమునకునుత్తర భాగముగానుండుననీ, ఈ సంస్థానముయొక్క వైశాల్యము రమారమి యేడువేల చదరపు మైళ్లుండును. సంవత్సరమునకీ సంస్థానము యొక్క యాదాయము 40 లక్షల రూపాయలు. కథానాయిక యగు శికందరు బేగ మీరాజ్యమునకు రాణిగా నుండెను.

పదియేడవ (17) శతాబ్దముయొక్క యంత్యమునందు డిల్లీలో రాజ్యము జేసిన యౌరంగ జేబు బాదషహావద్ద సర్దారుగా నున్న దోస్తమహమ్మదను తురుష్కునిచే నీరాజ్యముసంపాదింప బడెను. ఈ యఫగాను సర్దారుడు శూరుడనియు, సాహసియనియు, బుద్ధిమంతుడనియు విని యతనికి నౌరంగ జేబు బాదషహ మొట్టమొదట సైన్యములో నొక చిన్నయధికారమిచ్చెను. తదనంతర మొక పర్యాయము దోస్తమహమ్మదు సైన్యముతో గూడ రాజకార్యమునకయి మాళవప్రాంతమునకు బోయెను. ఇతని ధైర్యాదిగుణములజూచి, యచ్చటి సుబేదారితనియం


  • చక్కగా యోజించి చెప్పిన మాటయు, జక్కగా విచారించి చేసినపనియు దీర్ఘ కాలమునకును విఫలములు కానేరవు.