పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లోకమంతటను వెల్లడియైనందున శంకరులవారు వీరితో వాదించి గెలుపొంద నెంచి యాగ్రామమునకు వచ్చి నీళ్లు గొనిపోవుచున్న యువతులను మండనమిశ్రునిగృహ మెచటనని యడుగగా వారిట్లు చెప్పిరి:-

"ఎవని ద్వారమునందు బంజరమున నుంచబడిన ఆడు చిలుక వేదము స్వత: ప్రమాణమా పరత:ప్రమాణమా యని చర్చించుచుండునో యాగృహమే మండనమిశ్రుని దని తెలిసికొనుము."

"పూర్వకృత కర్మవలన, మన మిప్పుడు చేయుకార్యమునకు, ఫలము కలుగునా లేక పురుషప్రయత్నమువలన ఫలము కలుగునా యని యేద్వారములో బంజరస్థలయిన శుక యువతులు వాదించుచుండునో యదేగృహము మండనపండితునిది యను కొనుము."

"జగత్తు నిత్యమా యనిత్యమా యని యాడరామచిలుక ఏగృహముయొక్క సింహద్వారమునబంజరమందు ముచ్చటించు చుండునో యాగృహమే మండనునిది యనుకొనుము."

వారట్లు చెప్పగా శంకరులవా రచటి కరిగి మండనునిచే వాదభిక్ష గొనిరి. తరువాత సమస్తవిద్యాశారద యయిన సరసవాణిని సభకు నధిపతినిగా నేర్పరచి వారు వాదవివాదమునకు నుద్యుక్తులయిరి.

ఇట్లు కొన్ని దినములు వాదము జరిగినపిదప మండనుడు వాదమునందోడుట తటస్థ మయ్యెను. అప్పు డాతని ననుగ్ర