పుట:Aandhrashaasanasabhyulu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాంగ్రెస్ అభ్యర్ధులు 185, కమ్యూనిస్టులు 169, ప్రజా సోషలిష్టులు 42, స్వతంత్రులు 162, జనసంఘం 6, ఎన్నికలలో పోలైన మొత్తం ఓట్లు పక్షాలవారీగా పొందుపరిస్తే కాంగ్రెస్ కు 42,65,814, కమ్యూనిస్టులకు 26,95,562, ప్రజా సోషలిస్టులకు 4,82,825, స్వతంత్రులకు11,73,745, జనసంఘానికి 4,201.

రద్దయిన ఆంధ్ర శాసనసభలోని 117 మంది సభ్యులు ఈ ఎన్నికలలో పోటీచేశారు. వీరిలో 54 మంది మాత్రమే తిరిగి ఎన్నికైనారు. వారిలో పార్టీలవారీగా ఐక్యకాంగ్రెస్ 40, కమ్యూనిస్టు 8, ప్రజా సోషలిస్టు 3, స్వతంత్రులు 3, గెలుపొందారు. శ్రీ ప్రకాశం మంత్రి మండలియందలి ఏడుగురు సభ్యులలోని ఒక్క తెన్నేటి విశ్వనాధంగారు మినహా మిగతా వారందరూ ఎన్నికైనారు. గడచిన ఆంధ్ర శాసనసభలో ఒక్క ముస్లిం శాసనసభ్యుడు కూడా లేని లోటును, ప్రస్తుత శాసనసభలోని నల్గురు మహమ్మదీయ సభ్యులు తీర్చారు. పార్టీలక్రమంగా ఐక్య కాంగ్రెస్ 3, కమ్యూనిష్టు పార్టీ 1. నూతన ఆంధ్ర శాసనసభలో స్త్రీ సభ్యురాండ్ల సంఖ్య 3. ఐక్య కాంగ్రెస్ 2, ప్రజా సోషలిస్టు 1.

ప్రజా సోషలిస్టు పార్టీ గరపున గజపతి నగర ద్విసభ్య నియోజక వర్గంనుండి ఎన్నికైన విజయనగరం రాణి శ్రీమతి కుసుం గజపతిరాజుతో పోటీచేసిన అభ్యర్ధులందరికీ ధరావత్తులు పోవటం ఒక విశేషమనే చెప్పాలి.

ఈ ఎన్నికలలో పోటీచేసిన అభ్యర్ధులందరిలోను అత్యధిక ఓట్లు సంపాదించిన గౌరవము, ప్రతిష్ట " దివి " ద్విసభ్య నియోజకవర్గంలోని కాంగ్రెస్ కూటమి అభ్యర్ధి శ్రీ మల్లెపూడి రాజేశ్వరరావుకి దక్కుతుంది. వీరికి పోలైన ఓట్లు 61,128.

ఆంధ్ర శాసనసభలోని 29 ద్విసభ్య నియోజకవర్గాలలోను, అన్నిటికన్నా ఎక్కువ ఓట్లు పోలైన ద్విసభ్య నియోజకవర్గం కృష్ణాజిల్లా " దివి " ఇక్కడ మొత్తం పోలైన ఓట్లు 1,19,502. ఆంధ్రలో యిన్ని తడవలు ఎన్నికలు జరిగినప్పటికి కొండజాతి ప్రజలు ఎన్నికలలో పాల్గొని తద్వారా ప్రజాస్వామ్య ప్రభుత్వస్థాపన యందుగల తమ బాధ్యతను యింకా తగినవిధంగా గుర్తించలేదనే విషయం ఈ క్రింద