పుట:Aandhrakavula-charitramu.pdf/741

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవిరాక్షసుడు


ఇతఁడును దాక్షారామ నివాసుఁడే. ఇతఁడు కవిభల్లటునివలెనే నన్నయభట్టునకును తిక్కన సోమయాజి
కిని నడిమికాలమునం దుండినవాఁడు. ఇతఁడే వేములవాడ భీమకవి యని కొందఱనిరి గాని యిత డాతఁడు గాక కవిరాక్షసీయమును రచించిన వేఱొకకవియయి యున్నాఁడు. ఈతని గూర్చి యప్పకవి యీ క్రిందికధను వ్రాసెను.

       ఉ. ఆదిని శబ్దశాసన మహాకవి చెప్పినభారతంబులో
           నేది వచింపఁగాఁబడియె నెందును దానినె కాని సూత్రసం
           పాదనలేమిచేఁ దెలుఁగుఁబల్కు మఱొక్కటి కూర్చి చెప్పఁగా
           రా దని దాక్షవాటికవిరాక్షసుఁడే నియమంబు చేసినన్
       
        క. ఆ మూడు పర్వములలో
           సామాన్యుఁడు నుడువుతెనుఁగు లరసికొని కృతుల్
           తాము రచించిరీ తిక్కసు
           ధీమణి మొదలైనతొంటి తెలుఁగు కవీంద్రుల్.

కవి రాక్షసుని యాదినారాయణచరిత్రములోని దని యొకానొక లక్షణ గ్రంథములో నీ క్రింది పద్య ముదాహరింపఁబడినది.

       ఉ. శ్రీయుతలోచనోజ్జ్వలమరీచులు భానుమరీచివిస్పుర
           త్తోయజకాంతితోడ దులఁ దూఁగెడుపచ్చనిపట్టు గట్టియ
           త్యాయతశంఖచక్రరుచిరాసిగదాధరుఁ డేఁగుఁదెంచె నా
           రాయణుఁ డార్తరక్షణపరాయణుఁ డాకరిరాజుపాలికిన్.

[కవిరాక్షసుఁడనునది బిరుదమువలెఁ గానవచ్చుచున్నది. ఆంధ్రమునందే కాక సంస్కృతమున నొక కవిరాక్షసుఁడున్నాడు. అతఁడు 'షదర్ధ నిర్ణయ'